దేశవ్యాప్తంగా భానుడి భగభగలు

దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శనివారం రాజస్థాన్‌లోని ఫలౌదీలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. సార్వత్రిక ఎన్నికల ఆరో దశలో ఓట్లు వేసిన ఓటర్లు కూడా ఈ ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడ్డారు. చాలా పోలింగ్‌ కేంద్రాల దగ్గర నీళ్లు లేవు.

Published : 26 May 2024 04:30 IST

రాజస్థాన్‌లోని ఫలౌదీలో 50 డిగ్రీల సెల్సియస్‌ నమోదు
2019 తర్వాత దేశంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శనివారం రాజస్థాన్‌లోని ఫలౌదీలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. సార్వత్రిక ఎన్నికల ఆరో దశలో ఓట్లు వేసిన ఓటర్లు కూడా ఈ ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడ్డారు. చాలా పోలింగ్‌ కేంద్రాల దగ్గర నీళ్లు లేవు. వృద్ధులు కూర్చోవడానికి కుర్చీలు లేవు. కొన్ని చోట్ల వడగాడ్పులకు ఓటర్లు సొమ్మసిల్లిపడిపోయారు. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) లెక్కల ప్రకారం.. 2019 జూన్‌ 1 తర్వాత 50 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కావడం దేశంలో ఇదే తొలిసారి. వేడి గాలులు ఉత్తర మైదాన, మధ్య ప్రాంతాల్లోనే కాదు.. హిమాచల్‌ ప్రదేశ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లోనూ ప్రతాపం చూపించాయి. రాజస్థాన్, పంజాబ్, హరియాణా, దిల్లీ, చండీగఢ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌లకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భానుడి భగభగలు ఈ రాష్ట్రాల్లో ఈ నెల 29 వరకు కొనసాగనున్నాయని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని