తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

తల్లి పాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) హెచ్చరించింది.

Updated : 27 May 2024 06:07 IST

దిల్లీ: తల్లి పాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) హెచ్చరించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌-2006 చట్టం ప్రకారం తల్లి పాలను విక్రయించడానికి అనుమతి లేదని, వాటిని ఉపయోగించి చేస్తోన్న వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తల్లి పాలను శుద్ధి చేసి, విక్రయించేందుకు యత్నించే వ్యాపారులకు లైసెన్సులు జారీ చేయవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పాలిచ్చే తల్లుల నుంచి పాలను సేకరించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం పాల బ్యాంకులను నిర్వహిస్తోందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. అధిక లాభాల కోసం ఆన్‌లైన్‌లో తల్లి పాలను విక్రయిస్తున్న ఘటనలు ఈ మధ్య అధికంగా వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని