సంక్షిప్త వార్తలు (8)
నేను, నా సతీమణి అక్షతా మూర్తి కలిసి ఎక్కడికి వెళ్లినా ఇతరుల నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న.. మీలో ఉండే ఉమ్మడి విషయం ఏంటి? అని. దాంపత్య జీవితంలో కలిసి సినిమాలు చూడడం, నచ్చిన ఆహారాన్ని తినడం మాత్రమే కాదు.
భార్యాభర్తలు విలువలను కూడా పంచుకోవాలి
నేను, నా సతీమణి అక్షతా మూర్తి కలిసి ఎక్కడికి వెళ్లినా ఇతరుల నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న.. మీలో ఉండే ఉమ్మడి విషయం ఏంటి? అని. దాంపత్య జీవితంలో కలిసి సినిమాలు చూడడం, నచ్చిన ఆహారాన్ని తినడం మాత్రమే కాదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకే విధమైన విలువలకు కట్టుబడి ఉండడం. జీవితంలో ఏ స్థాయిలో ఉండాలో మన కష్టమే నిర్ణయిస్తుంది. దాన్నే మేమిద్దరం విశ్వసిస్తాం. ఏదైనా మార్పు సాధించాలంటే మాత్రం సాహసోపేతమైన నిర్ణయాలు అవసరమనే విషయంలోనూ ఇద్దరిదీ ఒకటే మాట. దాని ఫలితంగా మనకంటే మెరుగైన ప్రపంచాన్ని మన పిల్లలు వారసత్వంగా పొందుతారని మా విశ్వాసం.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
వేసవి తాపం.. ప్రభుత్వాలదే పాపం
ఎండలకు తాళలేకపోతున్నవారు వేసవి కాలాన్ని నిందించకండి. కేంద్రంలో వచ్చిన ప్రభుత్వాలు వృక్ష సంపదను పెంచడంలో ఘోరంగా విఫలమయ్యాయన్న వాస్తవాన్ని తెలుసుకోండి. ప్రపంచంలో సగటున ఒక్కో మనిషికి 422 చెట్లు ఉన్నాయి. కెనడాలో సగటున 10,163 వృక్షాలు, ఆస్ట్రేలియాలో 3266, అమెరికాలో 699, చైనాలో 130 ఉంటే భారత్లో 28 మాత్రమే ఉన్నాయి.
జవహర్ సర్కార్, తృణమూల్ రాజ్యసభ ఎంపీ
ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవడమే ఉత్తమం
మన తప్పుల నుంచి నేర్చుకొనే పరిస్థితి వస్తే అది బాధాకరంగా ఉంటుంది. దానికన్నా ముందే ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవడం ఉత్తమం. అనారోగ్యకరమైన తిండి వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నవారిని చూసి కూడా చాలా మంది జాగ్రత్తపడరు. తాము అనారోగ్యం బారినపడిన తర్వాతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెడతారు. మీకు క్రమశిక్షణ, ఇతరుల తప్పుల నుంచి నేర్చుకునే గుణం ఉంటే మీ జీవితం సాఫీగా సాగుతుంది.
మనోజ్ అరోడా, రచయిత
పిల్లలను శిక్షించడం అతిపెద్ద తప్పు
పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షించడం అతి పెద్ద తప్పు. శిక్ష ద్వారా పిల్లలు తమ తప్పు తెలుసుకోకపోగా, తల్లిదండ్రులపై ద్వేషాన్ని పెంచుకుంటారు. భవిష్యత్తులో తమ తప్పులు తల్లిదండ్రులకు తెలియకుండా దాచడానికి అబద్ధాలు చెప్పడంతోపాటు మొండివారిగా మారే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు అనునయంగా పిల్లల తప్పులను సరిదిద్దాలి. ఏం చేసి ఉంటే బాగుండేదో వివరించి చెప్పాలి. అప్పుడే వారిలో మార్పు వస్తుంది.
ల్యూక్ అడిస్ట్, పేరెంటింగ్ కోచ్
సంపద సృష్టి దేశవ్యాప్తంగా జరగాలి!
ఇండియా జీడీపీలో సగం 13 జిల్లాలు/నగరాల్లోనే కేంద్రీకృతమై ఉంది(మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ 2020-21 లెక్కల ప్రకారం). భవిష్యత్తులో సంపద సృష్టి, పంపిణీని భౌగోళికంగా విస్తరించాలి. అప్పుడే వలసలు ఆగుతాయి, అన్ని ప్రాంతాల ప్రజలూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తద్వారా జాతీయ సమగ్రత సాధ్యమవుతుంది.
పంకజ్ పచౌరీ, జర్నలిస్ట్
పోలీస్ కస్టడీకి దిల్లీ ఆసుపత్రి యజమాని
దిల్లీ: నిబంధనల ఉల్లంఘనతో పాటు అనుమతుల్లేకుండా ఆసుపత్రిని నడుపుతూ ఏడుగురు చిన్నారుల మృతికి కారణమైన దిల్లీలోని బేబీకేర్ హాస్పిటల్ యజమానిని న్యాయస్థానం సోమవారం పోలీస్ రిమాండ్కు అనుమతించింది. ఆసుపత్రి యజమాని డాక్టర్ నవీన్ ఖిచితో పాటు ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్ ఆకాశ్ కూడా మూడు రోజుల పాటు కస్టడీలో ఉంటారు. దీనికి సంబంధించిన ఉత్తర్వును చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విధి గుప్తా ఆనంద్ జారీ చేశారు. నిందితులు ఇద్దరినీ దిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తూర్పు దిల్లీలోని వివేక్విహార్లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు ఆహుతి కాగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆన్లైన్లో రైల్వే ఉద్యోగుల విచారణకు అనుమతి
ఈనాడు, దిల్లీ: రైల్వే ఉద్యోగులపై తీసుకునే క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి కొత్తగా రైల్వే సర్వెంట్స్ (కండక్ట్ ఆఫ్ డిసిప్లినరీ ఎంక్వయిరీ త్రూ వీడియో కాన్ఫరెన్స్) రెగ్యులేషన్స్ 2024 పేరుతో కొత్త నిబంధనలను జారీ చేస్తూ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే సర్వెంట్స్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్ 1968 ప్రకారం ఇప్పటివరకు జరుగుతూ వచ్చిన డిపార్ట్మెంటల్ విచారణలను ఇకనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగించడానికి వీలవుతుంది. ఎంక్వయిరీ అథారిటీ అనుమతిచ్చిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే దీన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఈ విచారణ ప్రక్రియను మొత్తం రికార్డు చేసి భద్రపరచనున్నారు.
వేసవిలో నల్లకోటు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థన
దిల్లీ: ఎండాకాలంలో న్యాయవాదులు నల్లకోటు వేసుకోవడం నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టులో శైలేంద్ర మణి త్రిపాఠి అనే అడ్వొకేట్ సోమవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు. అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అపెక్స్ న్యాయస్థానాలతోపాటు హైకోర్టులకూ దీన్ని వర్తింపజేయాలని ఆయన కోరారు. వేసవి సమయాన్ని నిర్దేశించేందుకు దేశంలోని అన్ని ‘స్టేట్ బార్ కౌన్సిళ్ల’ నుంచి అభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు. 2022లోనూ ఇదే తరహా అభ్యర్థనతో ఓ పిటిషన్ దాఖలు కాగా.. సుప్రీంకోర్టు సున్నితంగా తిరస్కరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ