46 శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు
లోక్సభకు ఎన్నికైన 543 మంది నూతన ఎంపీల్లో 251 (46 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 27 మంది దోషులుగా తేలినవారున్నారు.
93 శాతం మంది కోట్లకు పడగలెత్తినవారు
మొదటి రెండు స్థానాల్లో తెలుగువారే
105 మంది విద్యార్హత 5-12వ తరగతే
కొత్త ఎంపీలపై ఏడీఆర్ నివేదిక
దిల్లీ: లోక్సభకు ఎన్నికైన 543 మంది నూతన ఎంపీల్లో 251 (46 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 27 మంది దోషులుగా తేలినవారున్నారు. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు దిగువ సభ సభ్యులుగా ఉండటం ఈ దఫానే ఎక్కువని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. అలాగే ఈసారి 18వ లోక్సభకు భారీ సంఖ్యలో ధనవంతులు ఎన్నికయ్యారని, మొత్తం ఎంపీల్లో 504 (93 శాతం) మంది మిలియనీర్లు ఉన్నారని తెలిపింది. సంపదపరంగా మొదటి మూడు స్థానాల్లో ఉన్న ఎంపీల్లో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. గుంటూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన తెదేపా నేత చంద్రశేఖర్ పెమ్మసాని ఆస్తుల విలువ రూ.5,705 కోట్లుగా ఉంది. తెలంగాణలోని చేవెళ్ల నుంచి విజయం సాధించిన భాజపా నేత కొండా విశ్వేశ్వరరెడ్డి తన ఆస్తుల మొత్తాన్ని రూ.4,568 కోట్లుగా పేర్కొన్నారు. మూడో స్థానంలో ఉన్న నవీన్ జిందాల్.. రూ.1,241 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్లో ప్రకటించారు. ఆయన హరియాణాలోని కురుక్షేత్ర నుంచి గెలుపొందారు. గెలుపొందిన వారిలో 105 మంది తమ విద్యార్హతను 5, 12వ తరగతుల మధ్య అని పేర్కొనగా, మరో 420 మంది గ్రాడ్యుయేషన్ లేదా అంతకన్నా పై చదువులు అభ్యసించినట్లు తెలిపారని ఏడీఆర్ వెల్లడించింది.
నివేదికలోని మరిన్ని వివరాలు..
- 233 (43 శాతం) మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నాయని ప్రకటించారు.
- ఈ దఫా ఎన్నికైన వారిలో 170 (31 శాతం) మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై అకృత్యాల వంటి తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.
- 2014 లోక్సభలో 185 (34 శాతం) మంది, 2009లో 162 (30 శాతం) మంది, 2004లో 125 (23 శాతం) మంది ఎంపీలపై నేరాభియోగాలు ఉన్నాయి.
- 2009తో పోలిస్తే క్రిమినల్ కేసులను వెల్లడించిన వారి సంఖ్య 2024లో ఏకంగా 50 శాతం పెరిగింది.
- 2019లో 475 మంది మిలియనీర్లు ఉండగా.. 2014లో ఆ సంఖ్య 443గా ఉంది. 2009 నుంచి మిలియనీర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అప్పుడు 58 శాతం (315) మంది సంపన్నులు ఎన్నికయ్యారు.
- భాజపా నుంచి గెలుపొందిన 240 మంది ఎంపీల్లో 227 మంది అంటే 95 శాతం మంది ఆస్తిపరులే.
- 99 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 92 మందితో పాటు మిగతా పార్టీల్లో కూడా ఎన్నికైన అభ్యర్థుల్లో 90 శాతానికి పైగా ధనవంతులే ఉన్నారు. ఆప్(3), జేడీయూ(12), తెదేపా(16) నుంచి విజయం సాధించిన వారంతా మిలియనీర్లే కావడం గమనార్హం.
- 42శాతం మంది ఎంపీలకు రూ.10 కోట్లు లేదా అంతకుమించిన ఆస్తులున్నాయి. 19 శాతం మందికి రూ.5 నుంచి రూ.10 కోట్ల మధ్య సంపద ఉంది. 32 శాతం మందికి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య, ఒక శాతం మందికి రూ.20 లక్షల లోపు ఆస్తులున్నాయి. అభ్యర్థుల ఆర్థిక నేపథ్యాల ఆధారంగా గెలుపు అవకాశాలను ఏడీఆర్ నివేదిక విశ్లేషించింది.
- కొత్త లోక్సభలో 41 పార్టీల అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. గత లోక్సభలో 36 పార్టీల నుంచే సభ్యులున్నారు.
- జాతీయ పార్టీలకు 346 (64) స్థానాలు దక్కగా, రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు 179 (33 శాతం) సీట్లు లభించాయి.
- గుర్తింపు పొందని పార్టీల నుంచి 11 మంది, స్వతంత్రులుగా ఏడుగురు ఎంపీలుగా గెలిచారు.
- నీ 2009 నుంచి 2024 నాటికి రాజకీయ పార్టీ సంఖ్య 368 నుంచి 751 (104 శాతం) వరకూ పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి