ఉద్యోగంలో చేరే ముందు వీటిని గుర్తుంచుకోండి
నేను తొలిసారిగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు మా నాన్న నాకు 8 విలువైన సలహాలను పేపరుపై రాసి ఇచ్చారు.
నేను తొలిసారిగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు మా నాన్న నాకు 8 విలువైన సలహాలను పేపరుపై రాసి ఇచ్చారు. నాకెంతగానో ఉపయోగపడిన ఆ జాబితాను నా పిల్లలు పెద్దయ్యాక వారికి అందించాను. అందులోని అంశాలివీ:
1.అడిగిన దానికన్నా కనీసం 10 శాతం ఎక్కువ పని చెయ్యి.
2.ఏ హోదాలో ఉన్నా సీనియర్లతోనూ, జూనియర్లతోనూ మర్యాదగా ప్రవర్తిస్తూ శ్రద్ధాసక్తులతో పని చెయ్యి.
3.వాస్తవ పరిస్థితులపై అవగాహన ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడొద్దు.
4.ఎప్పుడూ ఫిర్యాదు చేయొద్దు. నిర్మాణాత్మకమైన, తీవ్రమైన విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు.
5.అవగాహన లేని విషయాలపై నీ అభిప్రాయాలను వాస్తవాలుగా చిత్రీకరించవద్దు.
6.నీ పనితీరు, ఫలితాలు, ఇతర కీలక అంశాలను గణాంక సహితంగా బేరీజు వేసుకో.
7.ఏ విషయాన్నైనా నేర్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండు. అయితే ప్రతిదాన్ని తార్కికంగా ఆలోచించు.
8. ఏ విషయంలోనైనా తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉండు.
మార్క్ రాండోల్ఫ్, నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు
విద్యతోనే బాలికలకు హక్కులపై అవగాహన
భావి పౌరులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు తమ హక్కుల గురించి తెలుసుకొని తమకు జరిగే అన్యాయాలపై పోరాడాలంటే వారికి విద్య, అవగాహన ముఖ్య సాధనాలు. విద్యావంతురాలైన బాలిక తన కోసం, తన తోటివారి కోసం ధైర్యంగా నిలబడగలుగుతుంది. కర్ణాటకలోని రామనగరలో జరిగిన ఉదంతమే అందుకు నిదర్శనం. తమ స్నేహితురాలికి తల్లిదండ్రులు 16 ఏళ్లకే పెళ్లి చేస్తున్న విషయం తెలుసుకున్న బాలికలు ఆ బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి ఒక్కటై మా సంస్థను సంప్రదించారు. వారి సత్వర స్పందనతో స్నేహితురాలిని బాల్య వివాహం నుంచి రక్షించుకున్నారు. బాలికలకు అవగాహన కల్పించడం పాఠశాలల బాధ్యత మాత్రమే కాదు, తల్లిదండ్రులది కూడా.
బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ
ఇతరుల నుంచి స్ఫూర్తి పొందొచ్చు కానీ..
విజేతలు సాధించిన విజయాలను చూసి స్ఫూర్తి పొందొచ్చు. కానీ అదే తరహాలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన పట్టుదల, అంకిత భావం మాత్రం మన మనసు నుంచే రావాలి. అప్పుడే మనకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకెళ్లే ఆత్మస్థైర్యం ఉంటుంది. లేకపోతే ఆ లక్ష్యాన్ని అలా వదిలేసి మరో విజేతను చూసి తాత్కాలిక స్ఫూర్తి పొందడమే పరిపాటిగా మారుతుంది.
నావల్ రవికాంత్, ఆంత్రప్రెన్యూర్
జీ20 దేశాల్లో భారత్ విద్యా సంస్థలే ఉత్తమం
గత పదేళ్లలో భారత్లో విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల ప్రమాణాలు, ప్రదర్శన నిరంతరం మెరుగుపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ విద్యా సంస్థలకు ర్యాంకులందించే ‘క్యూఎస్’ జాబితాలో 2015-2016కు సంబంధించి 11 విద్యా సంస్థలుండగా, 2024-2025 నాటికి వాటి సంఖ్య 318 శాతం పెరుగుదలతో 46కు చేరింది. జీ20 దేశాల్లో ఈ స్థాయి ఉత్తమ ప్రమాణాలు భారత్లోనే నమోదు కావడం విశేషం.
నుంజియో క్వాక్వరెల్లి, క్యూఎస్ సంస్థ సీఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం