కుమారుడు మృతి.. కోడలికి రెండో పెళ్లి చేసిన మాజీ ఎంపీ

ఛత్తీస్‌గఢ్‌లో ఓ మాజీ ఎంపీ వితంతువైన తన కోడలికి కొత్త జీవితాన్ని అందించారు. అనారోగ్యంతో తన కుమారుడు చనిపోగా ఒంటరి జీవనం సాగిస్తున్న కోడలికి.. తండ్రి స్థానంలో ఉండి మరో వ్యక్తితో వివాహం జరిపించారు.

Updated : 08 Nov 2022 09:29 IST

ఛత్తీస్‌గఢ్‌లో ఓ మాజీ ఎంపీ వితంతువైన తన కోడలికి కొత్త జీవితాన్ని అందించారు. అనారోగ్యంతో తన కుమారుడు చనిపోగా ఒంటరి జీవనం సాగిస్తున్న కోడలికి.. తండ్రి స్థానంలో ఉండి మరో వ్యక్తితో వివాహం జరిపించారు. ధమ్‌తరీకి చెందిన మాజీ ఎంపీ చందూలాల్‌ సాహు కుమారుడికి కల్యాణి సాహుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.

ఆ తర్వాత నాలుగేళ్లకు చందూలాల్‌ తనయుడు అనారోగ్యంతో మరణించారు. దీంతో కల్యాణి ఏడాదిన్నర వయసున్న కుమారుడితో ఒంటరిగా మారింది. ఈక్రమంలో కోడలికి రెండో వివాహం చేయడానికి చందూలాల్‌ తగిన వరుడి కోసం వెతికారు. ధమ్‌తరీకి చెందిన డాక్టర్‌ వీరేంద్ర గంజీర్‌ గురించి ఆయనకు తెలిసింది. వీరేంద్రకు కూడా గతంలో పెళ్లి కాగా భార్య గుండెపోటుతో మరణించింది.

అప్పటి నుంచి వీరేంద్ర తన కుమార్తెతో ఒంటరిగా జీవిస్తున్నాడు. వారిద్దరి అసంపూర్ణ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇరు కుటుంబాల సభ్యులు వారికి వివాహం చేయాలని నిశ్చయించారు. ధమ్‌తరీలోని వింధ్యవాసిని ఆలయంలో వారి వివాహం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని