10,000 ఏళ్లనాటి రాతి పెయింటింగ్‌లు

Eenadu icon
By National News Desk Published : 28 Oct 2025 04:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ధ్యప్రదేశ్‌లోని సాగర్‌ ప్రాంతంలో 10,000 ఏళ్లనాటి రాతి పెయింటింగ్‌లు లభ్యమయ్యాయి. సాగర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని మధియా గౌడ్‌ అనే గ్రామంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలకు ఇవి లభ్యమయ్యాయి. మానవాభివృద్ధి వివిధ దశలను ఇవి సూచిస్తున్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. వేల ఏళ్ల కిందటే భాష, లిపి అభివృద్ధి చేసినట్లు అనిపిస్తోందని వారు వివరించారు. అప్పట్లో కమ్యూనికేషన్‌ కోసం మానవులు ఈ పెయింటింగ్‌లను వాడుకున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా వారు దైనందిన జీవితాలను, సంప్రదాయాలను, పరిసరాల గురించి తెలియజేసుకునేవారని అనుకుంటున్నామని వెల్లడించారు. ఎక్కువ పెయింటింగ్‌లు ఎరుపు రంగులో కనిపించాయి. 

ఈటీవీ భారత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు