బిహార్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

Eenadu icon
By National News Desk Published : 31 Oct 2025 05:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘ఈటీవీ భారత్‌’తో తేజస్వి 

ఈటీవీ భారత్‌: బిహార్‌ ప్రజలు విసిగిపోయారనీ, వారు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని మహాగఠ్‌బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే బిహార్‌ను వలసలు లేని రాష్ట్రంగా మారుస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ గురువారం పట్నాలో ‘ఈటీవీ భారత్‌’తో ఆయన మాట్లాడారు. విద్య, ఉపాధి, వైద్యం ఇలా ఏ కారణంతోనైనా ఇతర రాష్ట్రాలకు బిహార్‌ ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూస్తామని చెప్పారు. ఐదేళ్లలో స్థానిక యువతకు అవకాశాలు కల్పించి, బిహార్‌ను ఆత్మనిర్భరత కలిగిన రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యమని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు