పలుగూ పార తోడు.. గంగమ్మ నవ్వింది చూడు

Eenadu icon
By National News Desk Published : 01 Nov 2025 04:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దృఢ సంకల్పానికి పట్టుదల తోడైనప్పుడు వయసు, వనరుల కొరత ఏవీ అడ్డంకులు కావు. మధ్యప్రదేశ్‌లోని టీకంగఢ్‌ జిల్లాలో స్వయంగా బావిని తవ్వుకొన్న గిరిజన దంపతుల ఉదంతం ఇందుకు నిదర్శనం. బడాగావ్‌ తహసీలు పరిధిలోని జమునియా ఖేడా గ్రామానికి చెందిన 65 ఏళ్ల దీప్‌చంద్‌ ఆదివాసీ, గౌరీబాయ్‌ దంపతులు ఐదేళ్లు శ్రమపడి బావిని తవ్వారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు తమకున్న బంజరు నేలలో బావి తవ్వుదామన్న ఆలోచన మొదట గౌరీబాయికి వచ్చింది. యంత్ర సాయం కూడా లేకుండా పలుగూ పారలతో తవ్విన ఈ బావి వారి తలరాతను మార్చేసింది. ఎర్రటి బంజరు పచ్చని మాగాణిగా మారింది. కుమారుడు నగరంలో పనులు చేసుకొంటూ ఉండగా, నలుగురు కుమార్తెల పెళ్లిళ్లు చేసిన దంపతులు సాగు ఆదాయంతో అప్పులు తీర్చే పనిలో నిమగ్నమయ్యారు.

ఈటీవీ భారత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని