PM Modi: గీతా ప్రెస్.. కోట్ల మంది విశ్వాసం, దేవాలయం: ప్రధాని మోదీ
వందల ఏళ్ల క్రితం వలసవాదులు దేశంలోని గురుకులాలను ధ్వంసం చేసినప్పుడు.. గీతా ప్రెస్ (Gita Press) మార్గదర్శిగా నిలిచి ఎంతో మందికి చేరువైందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.
గోరఖ్పుర్: గీతా ప్రెస్ ( Gita Press) కేవలం పుస్తకాలు ముద్రించే ముద్రణాలయం మాత్రమే కాదని, కోట్ల మంది విశ్వాసం, దేవాలయమని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని గోరఖ్పుర్ (Gorakhpur), వారణాశి (Varanasi)లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించారు. గోరఖ్పుర్ - లఖ్నవూ, జోధ్పుర్- అహ్మదాబాద్ల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. గోరఖ్పుర్-లఖ్నవూ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయోధ్య మీదుగా ప్రయాణిస్తుంది. వీటితోపాటు వారణాశిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
‘‘గీతా ప్రెస్ చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతి (Gandhi Peace Prize)ని ప్రకటించింది. గీతా ప్రెస్తో గాంధీజీకి ప్రత్యేక అనుబంధం ఉంది. కళ్యాణ పత్రిక ద్వారా గీతా ప్రెస్ కోసం ఆయన ఎన్నో రచనలు చేశారు. గీతా ప్రెస్ భారత దేశాన్ని ఏకం చేయడంతోపాటు, దేశ ఐకమత్యానికి బలాన్ని చేకూరుస్తుంది. 15 భాషల్లో 1,600 పైగా ప్రచురణలు చేసింది. 1923లో గీతా ప్రెస్ ఆధ్యాత్మిక వెలుగులను ప్రారంభించింది. ప్రస్తుతం అది మానవత్వానికి దిక్సూచిగా మారింది. వందల ఏళ్ల క్రితం వలసవాద శక్తులు భారత దేశాన్ని దోపిడీ చేసి, మన గురుకులాలను ధ్వంసం చేశాయి. అలాంటి సమయంలో గీతా ప్రెస్ మార్గదర్శిగా నిలిచి దేశవ్యాప్తంగా ఎంతో మందికి చేరువైంది. అలాంటి సంస్థ శతాబ్ధి ఉత్సవాలన వీక్షించడం మనందరి అదృష్టం. గీతా ప్రెస్ కేవలం ప్రెస్ మాత్రమే కాదు. కోట్ల మంది ప్రజల విశ్వాసం, ఎంతో మందికి దేవాలయం’’ అని ప్రధాని మోదీ తెలిపారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గీతాప్రెస్ ప్రచురణ సంస్థకు గాంధీ శాంతి పురస్కారాన్ని అందజేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, అవార్డు కింద ఇచ్చే రూ. కోటి నగదును గీతా ప్రెస్ తిరస్కరించింది. ఆ మొత్తాన్ని వేరే చోట ఖర్చు చేయాలని కేంద్రాన్ని కోరింది. మరోవైపు ఈ పురస్కారానికి గీతా ప్రెస్ను ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?