Onion Exports: ఆ నాలుగు దేశాలకు ఉల్లి ఎగుమతికి కేంద్రం అనుమతి

దేశంలో మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కేంద్రం సడలించింది. నాలుగు దేశాలకు పరిమిత స్థాయిలో ఉల్లిపాయల్ని ఎగుమతి చేసుకొనేందుకు వ్యాపారులకు అవకాశం కల్పించింది. 

Published : 22 Feb 2024 19:26 IST

Onion Exports | దిల్లీ: దేశంలో ఉల్లి ఎగుమతులపై నిషేధం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు బంగ్లాదేశ్, మారిషస్‌, బెహ్రెయిన్‌, భూటాన్‌లకు 54,760 టన్నుల ఉల్లిపాయల్ని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్‌ ఓ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, బహ్రెయిన్‌కు 3 వేల టన్నులు, భూటాన్‌కు 560 టన్నుల చొప్పున ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.

అయితే, మార్చి 31 వరకు మాత్రమే నిర్దేశించిన పరిమాణంలో ఉల్లిని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఉందని ఆయన స్పష్టంచేశారు. దీనికి సంబంధించిన విధివిధానాల్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశంలో ఉల్లి ధరల పెరుగుదలకు చెక్‌ పెట్టి దేశీయంగా సరఫరా పెంచేందుకు వీలుగా కేంద్రం గతేడాది డిసెంబర్‌ 8న ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం మార్చి 31 వరకు కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈనేపథ్యంలో విదేశాంగ చేసిన సూచన మేరకు తాజాగా పైనాలుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని