Mask: విమాన ప్రయాణికులకు మాస్క్‌ నిబంధన ఎత్తివేసిన కేంద్రం

విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Published : 16 Nov 2022 18:54 IST

దిల్లీ: విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన వేళ ఇకపై విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కేసులు తగ్గుతున్నప్పటికీ మాస్కులు ధరించడమే మంచిదని సూచించింది. ఎవరైనా మాస్కులు ధరించాలనుకుంటే.. వారి ఇష్టమేనని పేర్కొంది. కరోనా వైరస్‌ విజృంభించినప్పట్నుంచి ఇప్పటివరకు విమాన ప్రయాణికులకు మాస్కులు ధరించడం తప్పనిసరిని కఠినంగా అమలుచేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కొవిడ్‌ కేసులు తగ్గడంతో ప్రయాణికులు మాస్కులు ధరించేందుకు ఉద్దేశించి విమానాల్లో చేసే జరిమానా/శిక్షార్హమైన చర్యలపై ఇకపై ఎలాంటి సూచనల్ని ప్రకటించాల్సిన అవసరం లేదని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో బుధవారం 501 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 7561(0.02శాతం) ఉండగా.. రికవరీ రేటు 98.79శాతంగా ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని