Republic Day: చూద్దామా.. గగనతలంలో వాయుసేన అద్భుతాలు..!

దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర సంబరాలు అట్టహాసంగా జరిగాయి. రాజ్‌పథ్ మార్గంలో నిర్వహించిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా పరేడ్‌ చివర్లో

Updated : 23 Jan 2024 15:05 IST

గణతంత్ర పరేడ్‌కే హైలైట్‌గా ‘ఆజాదీ కా అమృత్‌’ విన్యాసాలు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర సంబరాలు అట్టహాసంగా జరిగాయి. రాజ్‌పథ్ మార్గంలో నిర్వహించిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా పరేడ్‌ చివర్లో భారత వాయుసేన గగనతలంలో ప్రదర్శించిన విన్యాసాలు హైలైట్‌గా నిలిచాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తొలిసారి భారత వాయుసేనకు చెందిన 75 విమానాలతో విన్యాసాలు నిర్వహించారు. 

పాత విమానాలతో పాటు ఆధునిక ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రఫేల్‌, సుఖోయ్‌, జాగ్వర్‌ వంటి విమానాలు గగనతంలో చేసిన విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాలుగు ఎంఐ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ‘ధ్వజ్‌’ ఆకృతిలో చేరి ఈ విన్యాసాలను ప్రారంభించాయి. ఆ తర్వాత అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు ‘రుద్ర’, ‘రహత్‌’ ఆకృతులను ప్రదర్శించాయి. ఇక 17 జాగ్వర్ యుద్ధ విమనాలు ‘అమృత్‌’(75 సంఖ్య ఆకృతి) రూపంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వాయుసేనలో ఇటీవలే చేరిన రఫేల్‌ విమానాలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 

తొలిసారి కాక్‌పిట్‌ నంచి వీక్షణ..

తొలిసారిగా భారత వాయుసేన కాక్‌పిట్‌ నుంచి వీక్షణను అందించింది. వాయుసేన విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా.. కాక్‌పిట్‌ నుంచి చిత్రీకరించిన వీడియోలను ప్రదర్శించింది. ఇలా ఆకాశంలో విమాన విన్యాసాల మధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం కావడం ఇదే తొలిసారి.  ఈ వీడియోలను రక్షణశాఖ అధికార ప్రతినిధి ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. వాటిని మీరూ ఓసారి చూసేయ్యండి..!





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని