Haryana bus crash: ఆ చిన్నారుల ప్రాణాలు దక్కేవే.. ప్రమాదాన్ని ముందే పసిగట్టి బస్సు ‘కీ’ లాక్కున్న స్థానికులు
Haryana School bus crash: హరియాణాలో స్కూల్ బస్సు ప్రమాదం ఆరుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
చండీగఢ్: హరియాణాలో గురువారం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదం (Haryana School bus crash) దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. సెలవు రోజు పాఠశాల తెరవడంతో పాటు స్కూల్ బస్సుల భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగురు చిన్నారుల మృతికి కారణమైన ఈ ప్రమాదంలో తాజాగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
స్థానికులు ముందే ఆపారు..
పోలీసుల వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ ధర్మేంద్ర మద్యం మత్తులో ఉన్నారు. అతడి ప్రవర్తన ముందు నుంచీ అనుమానంగానే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. తల్లిదండ్రులు సైతం అతడు నిత్యం మద్యం మత్తులో ఉండడం గమనించి పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త డ్రైవర్ను నియమించుకుంటామని వారు హామీ ఇవ్వటంతో వెనక్కి తగ్గారు. అయితే, గురువారం కూడా అతడి తీరు మారకపోగా.. బస్సును ప్రమాదకరంగా నడుపుతున్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే దాన్ని ఆపి తాళంచెవిని తీసుకున్నారు. పాఠశాల యాజమాన్యం రంగంలోకి దిగి ప్రస్తుతానికి బస్సు కదిలేందుకు అనుమతించాలని కోరింది. మర్నాడు నుంచి కొత్త డ్రైవర్ను పంపుతామని హామీ ఇచ్చింది. దీంతో గ్రామస్థులు అంగీకరించి తాళంచెవిని అప్పజెప్పారు.
కంటతడి పెట్టించిన దృశ్యాలు..
అక్కడి నుంచి బస్సు కొంత దూరం ప్రయాణించగానే అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఆ సమయంలో అందులో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. రక్తపు మడుగులో పసివాళ్లు పడి ఉండడం.. వారి లంచ్ బాక్స్లు, బూట్లు, పుస్తకాలు, చెల్లాచెదురవడం చూసిన వారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నలుగురు సభ్యులతో కమిటీ
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పాఠశాల ప్రిన్సిపల్, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రమాదం సంగతి తెలియగానే ఘటనా స్థలానికి వెళ్లిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీమా త్రిఖా.. రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం సెలవు ప్రకటించినప్పటికీ పాఠశాలకు ఎందుకు సెలవు ఇవ్వలేదనే విషయమై ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. పాఠశాల బస్సుల భద్రతకు సంబంధించిన విధానాన్ని సమీక్షించేందుకు రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు