‘ఘన’మైన ఆపరేషన్లు.. ‘కువైట్ ఎయిర్లిఫ్ట్’ నుంచి ‘ఆపరేషన్ గంగ’ వరకూ..
ప్రపంచంలో ఏ మూల యుద్ధ మేఘాలు కమ్ముకున్నా భీతిల్లేది మనమే... ఎక్కడ బాంబు దాడులు జరిగినా ఉలిక్కిపడేది భారతీయులే...
ప్రపంచంలో ఏ మూల యుద్ధ మేఘాలు కమ్ముకున్నా భీతిల్లేది మనమే... ఎక్కడ బాంబు దాడులు జరిగినా ఉలిక్కిపడేది భారతీయులే... ఏ ఉత్పాతం సంభవించినా ఆందోళన మనకే... ఎందుకంటే జగమంత విస్తరించిన కుటుంబం మనది... ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో చిక్కుకున్న గుండెలకు అభయహస్తమిస్తోంది మన సైన్యం... రేపటిపై ఆశ వదులుకున్న వారిని సైతం సురక్షితంగా స్వదేశం తీసుకొస్తున్నాయి మన త్రివిధ దళాలు... దానికోసం భారీ ‘ఆపరేషన్’ చేస్తున్నాయి... ఆనాటి కువైట్ ఎయిర్లిఫ్ట్ నుంచి నేటి ఆపరేషన్ గంగ వరకు సాగిన సాహసాలివి.
కువైట్ ఎయిర్లిఫ్ట్- ఏడాది: 1990
1990లో కువైట్ని ఇరాక్ హస్తగతం చేసుకుంది. బాంబు దాడులతో హోరెత్తించింది. అప్పుడు కువైట్లో రెండు లక్షల మంది భారతీయులు చిక్కుకుపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడపసాగారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం, భారత సైన్యం, ఎయిర్ ఇండియా రంగంలోకి దిగాయి. రెండునెలల కాలంలో రెండు లక్షలమంది భారతీయులను సురక్షితంగా ఇండియా తీసుకొచ్చాయి. ఇప్పటివరకు ఎన్నో యుద్ధాలు జరిగినా ఇంత పెద్ద సంఖ్యలో ఏ దేశమూ తమ పౌరులను వెనక్కి తీసుకురాలేదు. ఇది ప్రపంచరికార్డు. దీనిపై బాలీవుడ్లో ‘ఎయిర్లిఫ్ట్’ పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది.
ఆపరేషన్ సేఫ్ హోమ్కమింగ్- సంవత్సరం: 2011
ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాలో 2010లో పౌర తిరుగుబాటు చోటు చేసుకుంది. కొన్ని సాయుధ సంస్థలు కల్నల్ గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం మొదలుపెట్టాయి. విచక్షణారహితంగా ఆయుధాలతో దాడి చేస్తూ బీభత్సం సృష్టించాయి. ఆ సమయంలో లిబియాలో పదిహేను వేల మంది భారతీయులు ఉన్నారు. అప్పటి ప్రభుత్వం లిబియా పాలకులు, తీవ్రవాద సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి విమానాలు, నౌకల ద్వారా మొత్తం భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు.
ఆపరేషన్ రాహత్- ఏడాది: 2015
యెమెన్ ప్రభుత్వం, హౌతీ తెగల మధ్య చాలా ఏళ్లుగా రగులుకుంటూ వస్తున్న వివాదం 2015 నాటికి యుద్ధరూపం దాల్చింది. ఇరుపక్షాలు భీకరంగా కాల్పులకు దిగేవాళ్లు. ఆ సమయంలో వేల సంఖ్యలో భారతీయులు చిక్కుకొనిపోయారు. వారిని రక్షించేందుకు అక్కడి ప్రభుత్వ అనుమతితో భారత బలగాలు యెమెన్లో అడుగుపెట్టాయి. ఉగ్రవాదులపై మెరుపుదాడి చేస్తూ వేలమంది ఇండియన్స్తోపాటు, వందలమంది విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
2016 బ్రసెల్స్ తరలింపు- ఏడాది: 2016
బ్రసెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి నెలలో ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడులకు తెబడ్డారు. ఆ సమయంలో 242 మంది భారతీయులు, జెట్ ఎయిర్వేస్ సిబ్బంది విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ప్రభుత్వం, జెట్ ఎయిర్వేస్ సంస్థ సంయమనంతో వ్యవహరించి రెండు రోజుల్లో వాళ్లందరినీ భారత్ తీసుకొచ్చాయి.
వందే భారత్ మిషన్- సంవత్సరం: 2020
ఈసారి మన ప్రభుత్వం, విమానయాన, నౌకయాన సంస్థలు యుద్ధం చేసింది కరోనా మహమ్మారితో. కొవిడ్ వ్యాప్తి అరికట్టేందుకు పలుదేశాలు ఆకాశయాన రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఆ సమయంలో దాదాపు 60 లక్షల మంది భారతీయులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. పరిస్థితి కొంచెం మెరుగు పడగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. వాయు, జల, రోడ్డు, ఇతర మార్గాల ద్వారా లక్షలమందిని సొంత దేశం రప్పించింది.
ఆపరేషన్ దేవ్ శక్తి- సంవత్సరం: ఆగస్టు 2021
అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న 438 మంది భారతీయులను మన ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో భారత్కి సురక్షితంగా తీసుకొచ్చింది.
ఆపరేషన్ గంగా- ఏడాది: 2022
తాజాగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన మనవాళ్లను స్వదేశం తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ ఇది. అక్కడ దాదాపు ఇరవై వేల మంది భారతీయులున్నారు. అందులో అత్యధికులు వైద్య విద్యార్థులే. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో దశల వారీగా మనవారిని విమానాల్లో తీసుకొస్తున్నారు. ఇప్పటికి సగం మిషన్ పూర్తైంది. దీనికోసం కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు, జనరల్ వీకే సింగ్లు పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు