Ravi Kishan: కాశీ తర్వాత కీలకమైనది గోరఖ్పూర్ స్థానమే.. భాజపా ఎంపీ రవి కిషన్
లోక్సభ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి పోటీ చేయడానికి తనకు పార్టీ నాయకత్వం మరోసారి అవకాశమిచ్చిందని భాజపా ఎంపీ రవి కిషన్ ఆనందం వ్యక్తం చేశారు.
గోరఖ్పూర్: సినీనటుడు, భాజపా ఎంపీ రవి కిషన్(Ravi Kishan) ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో గోరఖ్పూర్(Gorakhpur) నుంచి పోటీ చేయడానికి తనకు పార్టీ మరోసారి అవశామిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘నేను అగ్ర నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. కాశీ తర్వాత అత్యంత కీలకమైన స్థానం గోరఖ్పూర్ నుంచి నాకు రెండో సారి పోటీ చేయడానికి అవకాశమిచ్చింది. ఈ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. భాజపా 400సీట్లు గెలుస్తుంది. గోరఖ్పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది.’’ అని తెలిపారు.
కాగా భాజపా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 అభ్యర్థులతో మొదటి జాబితాను ఆదివారం విడుదల చేసింది. వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేయనుండగా, గుజరాత్లోని గాంధీ నగర్ నుంచి అమిత్షా బరిలోకి దిగనున్నారు. ప్రముఖ భోజ్పురి నటుడు రవి కిషన్, యోగి ఆదిత్యనాథ్ కంచుకోట గోరఖ్పూర్ నుంచి రెండో సారి పోటీ చేయనున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన 3లక్షల ఓట్ల ఆధిక్యంతో ఎస్పీ అభ్యర్థి రాంభూల్ నిషాద్పై గెలుపొందారు.
భాజపా తొలి జాబితాలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈశాన్య దిల్లీ నుంచి లోక్సభ సభ్యుడు మనోజ్ తివారీని పోటీలో నిలబెట్టింది. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో దివంగత భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్ కుమార్తె బసురి స్వరాజ్ను న్యూదిల్లీ అభ్యర్థిగా ప్రకటించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి పోటీ చేయనున్నారు. సర్భానంద సోనోవాల్ డిబ్రూగఢ్ నుంచి పోటీ చేయనుండగా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కోటా నుంచి బరిలోకి దిగనున్నారు.
రాజస్థాన్లోని అల్వార్ నుంచి భూపేందర్ యాదవ్, పోర్బందర్ నుంచి మన్సుఖ్ మాండవీయ, రాజ్కోట్ (గుజరాత్) నుంచి పర్షోత్తమ్ రూపాలా, తిరువనంతపురం నుంచి రాజీవ్ చంద్రశేఖర్లను పోటీకి దింపింది.
జోధ్పూర్లో గజేంద్ర షెకావత్, అమేథీలో స్మృతి ఇరానీ, ఆగ్రాలో ఎస్పీ సింగ్ బఘేల్, ముజఫర్నగర్లో సంజీవ్ బల్యాన్, ఖేరీలో అజయ్ మిశ్రా తేని, బికనేర్లో అర్జున్ రామ్ మేఘ్వాల్, ఫతేహ్పూర్లో సాధ్వి నిరంజన్ జ్యోతి, సిట్టింగ్ స్థానాల నుంచి కేంద్ర మంత్రులుగా బరిలోకి దిగుతున్నారు.
ఇండియా కూటమికి మరో ఎదురు దెబ్బ:
జయంత్ చౌదరికి చెందిన రాష్ట్రీయ లోక్ దళ్(RLS) శనివారం ఎన్డీఏ కూటమిలో అధికారికంగా చేరింది. ఆయన దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం ఎక్స్ ఖాతాలో ఎన్డీఏలో చేరినట్టుగా ప్రకటించారు. ఆర్ఎల్ఎస్ పార్టీ ఇండియా కూటమిలో భాగం. చౌదరి భాజపాతో పొత్తు పెట్టుకోవడంతో ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యతకు మరో ఎదురు దెబ్బ తగిలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు