ఆ దేశాల్లో పాఠశాలలు ఎలా నడుస్తున్నాయ్?
కరోనా మహమ్మారి 2020 ఏడాదిని ఒక పీడకలగా మిగిల్చింది. చైనాలో మొదలై ప్రపంచదేశాలకు వ్యాపించి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఈ వైరస్ను కట్టడి చేయడం కోసం గతేడాది మార్చి-ఏప్రిల్లో దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో అన్ని కార్యాకలాపాలతోపాటు
కరోనా మహమ్మారి 2020 ఏడాదిని ఒక పీడకలగానే మిగిల్చింది. చైనాలో మొదలై ప్రపంచదేశాలకు పాకిన ఈ మహమ్మారి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఈ వైరస్ను కట్టడి చేసేందుకు గతేడాది మార్చి-ఏప్రిల్లో దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో అన్ని కార్యాకలాపాలు నిలిచిపోవడంతో పాటు పాఠశాలలూ మూతపడ్డాయి. కొన్ని నెలలపాటు విద్యార్థులంతా చదువుకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. ఆన్లైన్ తరగతులు నిర్వహించినా.. పాఠశాలల్లో బోధనతోనే విద్యార్థులు ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. అందుకే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చాలా దేశాల్లో పాఠశాలలను తిరిగి ప్రారంభించారు. భారత్లోనూ కరోనా నిబంధనలకు లోబడి పలుచోట్ల తరగతులు మొదలయ్యాయి. మరి ఇతర దేశాల్లో కరోనా ప్రభావం పెద్దగా తగ్గకపోయినా.. దాన్ని కట్టడి చేస్తూ పాఠశాలను ఎలా నిర్వహిస్తున్నారు? వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తెలుసుకుందాం పదండి..
ఎప్పటికప్పుడు శుభ్రం
కరోనా విలయతాండవం చేసిన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా.. గతేడాది జూన్లోనే పాఠశాలలను తెరుచుకున్నాయి. అయితే, విద్యార్థులు పాఠశాలకు రావడం తప్పనిసరేం కాదని ప్రభుత్వం సూచించింది. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి మాత్రం విద్యార్థులు పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని వెల్లడించింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా కరోనా నిబంధనలను కఠినతరం చేసింది. ఆరేళ్లు పైబడిన విద్యార్థులు, టీచర్లు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని షరతు విధించింది. విద్యార్థులు గుంపుగా నిలబడకుండా, పాఠశాల కారిడార్లలో ఎదురెదురుగా నడవకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. తరగతి గదుల తలుపులు, భోజనశాలలో బల్లల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించింది. ఫ్రాన్స్లో రెండోసారి కరోనా విజృంభించడం, అదే సమయంలో క్రిస్మస్ ఉండటంతో విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. జనవరి 4న తిరిగి తరగతులు ప్రారంభించింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
వీలైతే పాఠశాల ఆవరణలో..
ఇటలీలో లాక్డౌన్ నిబంధనలు చాలా కఠినంగా అమలు చేశారు. మార్చిలో లాక్డౌన్ విధించగా.. సెప్టెంబర్ వరకు పాఠశాలలు మూతపడే ఉన్నాయి. సెప్టెంబర్ చివర్లో పాఠశాలలు తెరుచుకోగా.. విద్యార్థుల మధ్య కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు తగ్గట్టు తరగతి గదుల్ని మార్చుకోవాలని చెప్పింది. వీలైతే పాఠశాల ఆవరణలో విద్యార్థులకు బోధించాలని పేర్కొంది. సిలబస్ పూర్తి చేయడం కోసం శనివారాల్లోనూ పాఠశాలలు నడిపించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆరుగురు చొప్పున ఓ గ్రూపు
కెనడాలో దాదాపు 13 జిల్లాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే, విద్యార్థులు, టీచర్లు మాస్కులకు బదులు ఫేస్షీల్డ్ ధరించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అలాగే యూనెస్కో నిబంధనల ప్రకారం.. చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది. విద్యార్థులను ఆరుగురు చెప్పున ఒక గ్రూపుగా విభజించి.. ఆయా గ్రూపుల మధ్య కనీసం ఒక మీటరు దూరం పాటించాలని, టీచర్లకు 2 మీటర్ల దూరం ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది.
థర్మల్ స్క్రీనింగ్.. స్వాబ్ పరీక్షలు
కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో పాఠశాలలో అడుగుపెట్టే ముందు విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అలాగే లాక్డౌన్ తర్వాత మొదటిసారి పాఠశాలకు వచ్చిన విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వుహాన్లోని పాఠశాలల్లో అయితే ప్రతి రోజు విద్యార్థుల నుంచి స్వాబ్ శాంపిల్స్ తీసుకొని పరీక్షలు చేస్తున్నారు.
డెస్క్లపై ప్లెక్సీగ్లాజ్
నెదర్లాండ్స్లోని పాఠశాలల్లో ప్రవేశ ద్వారం వద్ద ప్లాస్టిక్ షీల్డ్లు, డిసిన్ఫెక్టెంట్ జెల్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు కూర్చునే డెస్క్లపై ప్లెక్సీగ్లాజ్ పెట్టారు. వీటి వల్ల పక్కపక్కన కూర్చునే విద్యార్థులకు ఎలాంటి కాంటాక్ట్ ఉండకుండా ఈ ఏర్పాటు చేశారు. మాస్క్ ధరించడం అంత తప్పనిసరేమీ కాదని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అయితే, తరగతి గదుల్లో వీలైనంత ఎక్కువ వెంటిలేషన్ ఉండేలా చూడాలని సూచించింది.
షిఫ్ట్ల వారీగా..
డెన్మార్క్లో పాఠశాలల నిర్వహణలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. తరగతుల్ని షిఫ్ట్ల వారీగా విభజించారు. ఒక్కో షిఫ్ట్లో విద్యార్థులు వేర్వేరు ప్రవేశ ద్వారాల నుంచి రావాలని సూచించారు. అంతేకాదు.. బోధనా సమయాన్ని కూడా తగ్గించారు. కొన్ని పాఠశాలల్లో కరోనాను నియంత్రించడం కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
బయో బబుల్ గ్రూపులు
స్పెయిన్ ప్రభుత్వం మొదట్లో పాఠశాలలు తెరిచినా తరగతులకు హాజరు కావడం.. కాకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇష్టమని తెలిపింది. కానీ, సెప్టెంబర్ నుంచి విద్యార్థులు కచ్చితంగా తరగతులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడం కోసం 17 ప్రాంతాల్లో 11వేల మంది టీచర్లను అదనంగా నియమించింది. తరగతుల్ని షిఫ్ట్ల వారీగా విభజించి.. వీలైతే పాఠశాల ఆవరణల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. 15 నుంచి 20మంది విద్యార్థుల చొప్పున ‘బయో బబుల్’ గ్రూపులను ఏర్పాటు చేసి ఆయా గ్రూపుల మధ్య సామాజిక దూరం పాటించేలా చూడాలని పేర్కొంది.
రేడియోల ద్వారా తరగతులు
ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలు ఇప్పటికే పాఠశాలలు తెరవగా.. కరోనా కేసులు నమోదు కావడంతో మళ్లీ మూతపడ్డాయి. దీంతో విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు వారి తల్లిదండ్రులు మొగ్గుచూపట్లేదు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే తరగతులు కొనసాగేలా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కెన్యా 2020 ఏడాది మొత్తం పాఠశాలలు మూసి వేసింది. ఉగాండా ప్రభుత్వం గ్రామాల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు రేడియోలను ఏర్పాటు చేస్తోంది. కాగా.. కరోనా పరిస్థితులను బట్టి ప్రపంచంలోని అన్ని పాఠశాలల నిర్వహణలో మార్పులు జరుగుతూ ఉన్నాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు