ఆ దేశాల్లో పాఠశాలలు ఎలా నడుస్తున్నాయ్?
కరోనా మహమ్మారి 2020 ఏడాదిని ఒక పీడకలగా మిగిల్చింది. చైనాలో మొదలై ప్రపంచదేశాలకు వ్యాపించి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఈ వైరస్ను కట్టడి చేయడం కోసం గతేడాది మార్చి-ఏప్రిల్లో దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో అన్ని కార్యాకలాపాలతోపాటు
కరోనా మహమ్మారి 2020 ఏడాదిని ఒక పీడకలగానే మిగిల్చింది. చైనాలో మొదలై ప్రపంచదేశాలకు పాకిన ఈ మహమ్మారి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఈ వైరస్ను కట్టడి చేసేందుకు గతేడాది మార్చి-ఏప్రిల్లో దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో అన్ని కార్యాకలాపాలు నిలిచిపోవడంతో పాటు పాఠశాలలూ మూతపడ్డాయి. కొన్ని నెలలపాటు విద్యార్థులంతా చదువుకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. ఆన్లైన్ తరగతులు నిర్వహించినా.. పాఠశాలల్లో బోధనతోనే విద్యార్థులు ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. అందుకే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చాలా దేశాల్లో పాఠశాలలను తిరిగి ప్రారంభించారు. భారత్లోనూ కరోనా నిబంధనలకు లోబడి పలుచోట్ల తరగతులు మొదలయ్యాయి. మరి ఇతర దేశాల్లో కరోనా ప్రభావం పెద్దగా తగ్గకపోయినా.. దాన్ని కట్టడి చేస్తూ పాఠశాలను ఎలా నిర్వహిస్తున్నారు? వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తెలుసుకుందాం పదండి..
ఎప్పటికప్పుడు శుభ్రం
కరోనా విలయతాండవం చేసిన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా.. గతేడాది జూన్లోనే పాఠశాలలను తెరుచుకున్నాయి. అయితే, విద్యార్థులు పాఠశాలకు రావడం తప్పనిసరేం కాదని ప్రభుత్వం సూచించింది. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి మాత్రం విద్యార్థులు పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని వెల్లడించింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా కరోనా నిబంధనలను కఠినతరం చేసింది. ఆరేళ్లు పైబడిన విద్యార్థులు, టీచర్లు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని షరతు విధించింది. విద్యార్థులు గుంపుగా నిలబడకుండా, పాఠశాల కారిడార్లలో ఎదురెదురుగా నడవకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. తరగతి గదుల తలుపులు, భోజనశాలలో బల్లల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించింది. ఫ్రాన్స్లో రెండోసారి కరోనా విజృంభించడం, అదే సమయంలో క్రిస్మస్ ఉండటంతో విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. జనవరి 4న తిరిగి తరగతులు ప్రారంభించింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
వీలైతే పాఠశాల ఆవరణలో..
ఇటలీలో లాక్డౌన్ నిబంధనలు చాలా కఠినంగా అమలు చేశారు. మార్చిలో లాక్డౌన్ విధించగా.. సెప్టెంబర్ వరకు పాఠశాలలు మూతపడే ఉన్నాయి. సెప్టెంబర్ చివర్లో పాఠశాలలు తెరుచుకోగా.. విద్యార్థుల మధ్య కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు తగ్గట్టు తరగతి గదుల్ని మార్చుకోవాలని చెప్పింది. వీలైతే పాఠశాల ఆవరణలో విద్యార్థులకు బోధించాలని పేర్కొంది. సిలబస్ పూర్తి చేయడం కోసం శనివారాల్లోనూ పాఠశాలలు నడిపించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆరుగురు చొప్పున ఓ గ్రూపు
కెనడాలో దాదాపు 13 జిల్లాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే, విద్యార్థులు, టీచర్లు మాస్కులకు బదులు ఫేస్షీల్డ్ ధరించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అలాగే యూనెస్కో నిబంధనల ప్రకారం.. చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది. విద్యార్థులను ఆరుగురు చెప్పున ఒక గ్రూపుగా విభజించి.. ఆయా గ్రూపుల మధ్య కనీసం ఒక మీటరు దూరం పాటించాలని, టీచర్లకు 2 మీటర్ల దూరం ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది.
థర్మల్ స్క్రీనింగ్.. స్వాబ్ పరీక్షలు
కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో పాఠశాలలో అడుగుపెట్టే ముందు విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అలాగే లాక్డౌన్ తర్వాత మొదటిసారి పాఠశాలకు వచ్చిన విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వుహాన్లోని పాఠశాలల్లో అయితే ప్రతి రోజు విద్యార్థుల నుంచి స్వాబ్ శాంపిల్స్ తీసుకొని పరీక్షలు చేస్తున్నారు.
డెస్క్లపై ప్లెక్సీగ్లాజ్
నెదర్లాండ్స్లోని పాఠశాలల్లో ప్రవేశ ద్వారం వద్ద ప్లాస్టిక్ షీల్డ్లు, డిసిన్ఫెక్టెంట్ జెల్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు కూర్చునే డెస్క్లపై ప్లెక్సీగ్లాజ్ పెట్టారు. వీటి వల్ల పక్కపక్కన కూర్చునే విద్యార్థులకు ఎలాంటి కాంటాక్ట్ ఉండకుండా ఈ ఏర్పాటు చేశారు. మాస్క్ ధరించడం అంత తప్పనిసరేమీ కాదని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అయితే, తరగతి గదుల్లో వీలైనంత ఎక్కువ వెంటిలేషన్ ఉండేలా చూడాలని సూచించింది.
షిఫ్ట్ల వారీగా..
డెన్మార్క్లో పాఠశాలల నిర్వహణలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. తరగతుల్ని షిఫ్ట్ల వారీగా విభజించారు. ఒక్కో షిఫ్ట్లో విద్యార్థులు వేర్వేరు ప్రవేశ ద్వారాల నుంచి రావాలని సూచించారు. అంతేకాదు.. బోధనా సమయాన్ని కూడా తగ్గించారు. కొన్ని పాఠశాలల్లో కరోనాను నియంత్రించడం కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
బయో బబుల్ గ్రూపులు
స్పెయిన్ ప్రభుత్వం మొదట్లో పాఠశాలలు తెరిచినా తరగతులకు హాజరు కావడం.. కాకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇష్టమని తెలిపింది. కానీ, సెప్టెంబర్ నుంచి విద్యార్థులు కచ్చితంగా తరగతులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడం కోసం 17 ప్రాంతాల్లో 11వేల మంది టీచర్లను అదనంగా నియమించింది. తరగతుల్ని షిఫ్ట్ల వారీగా విభజించి.. వీలైతే పాఠశాల ఆవరణల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. 15 నుంచి 20మంది విద్యార్థుల చొప్పున ‘బయో బబుల్’ గ్రూపులను ఏర్పాటు చేసి ఆయా గ్రూపుల మధ్య సామాజిక దూరం పాటించేలా చూడాలని పేర్కొంది.
రేడియోల ద్వారా తరగతులు
ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలు ఇప్పటికే పాఠశాలలు తెరవగా.. కరోనా కేసులు నమోదు కావడంతో మళ్లీ మూతపడ్డాయి. దీంతో విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు వారి తల్లిదండ్రులు మొగ్గుచూపట్లేదు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే తరగతులు కొనసాగేలా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కెన్యా 2020 ఏడాది మొత్తం పాఠశాలలు మూసి వేసింది. ఉగాండా ప్రభుత్వం గ్రామాల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు రేడియోలను ఏర్పాటు చేస్తోంది. కాగా.. కరోనా పరిస్థితులను బట్టి ప్రపంచంలోని అన్ని పాఠశాలల నిర్వహణలో మార్పులు జరుగుతూ ఉన్నాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు