Sonal Goel: ఆ ఎదురుదెబ్బే నాలో కసిని పెంచింది: ఐఏఎస్ అధికారిణి
ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయల్ ఎక్స్లో చేసిన ట్వీట్కు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయల్ (IAS officer Sonal Goel) ఎక్స్లో చేసిన ట్వీట్ వైరలైంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సమయం దగ్గర పడుతుండడంతో పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను ప్రేరేపించేలా తన మొదటి అటెంప్ట్లో మెయిన్స్లో వచ్చిన మార్క్షీట్ను ఎక్స్లో పోస్టు చేశారు. 2007లో జనరల్ స్టడీస్ పేపర్లో తక్కువ మార్కులు రావడంతో ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించలేకపోయానని ఆమె తెలిపారు.
కాని దానితో కుంగిపోకుండా మరింత కఠిన దీక్ష, నిరంతర అభ్యాసంతో జనరల్ స్టడీస్పై పట్టు సాధించడానికి నోట్స్ తయారుచేసుకోవడం, మెయిన్స్లో జవాబులు రాసే విధానంపై పదే పదే ప్రాక్టీస్ చేసేదాన్నని తెలిపారు. దానివల్లే 2008లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, కలెక్టర్ కావాలన్న తన కలను నిజం చేసుకోగలిగానని గోయల్ చెప్పుకొచ్చారు.
తాను దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి లా చేస్తూ, ఓ కంపెనీలో పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తూ సివిల్స్ సాధించానన్నారు. దీనికోసం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నానని, అందువల్లే తన ఆప్షనల్ సబ్జెక్టులు కామర్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లతో పోల్చితే జనరల్ స్టడీస్లోనే అత్యధిక మార్కులు సాధించానని గుర్తు చేసుకున్నారు.
అభ్యర్థులు వైఫల్యాలకు కుంగిపోకుండా వాటినుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని విజయానికి దారిలా చూడాలని సూచించారు. ‘‘నాకు తగిలిన ఎదురుదెబ్బే నేను నా లక్ష్యాన్ని సాధించేందుకు కావలసిన కసిని, బలాన్ని, దృఢత్వాన్ని పెంచింది.’’ అని ఆమె ఎక్స్లో చేసిన పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ మీరు ఇచ్చిన స్ఫూర్తి గొప్పది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు, ముఖ్యంగా కామర్స్, లాను ఆప్ష్నల్గా తీసుకున్న వారిలో మీ పోస్టు కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అని ప్రశంసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?