IAF: చిమ్మచీకట్లో నైట్ విజన్ గాగుల్స్తో.. వాయుసేన అరుదైన ఫీట్
చైనాతో ఉద్రిక్తతల వేళ.. భారత వైమానిక దళం సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. తూర్పు సెక్టార్లో చిమ్మచీకట్లో సైనిక ఆపరేషన్లు చేపట్టే సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా అడుగువేసింది.
దిల్లీ: భారత వాయుసేన (IAF) మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్(NVG) సాయంతో తూర్పు సెక్టార్లో ట్రాన్స్పోర్టు విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. C-130J విమానం అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్లో దిగిందని వాయుసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించి రెండు వీడియో క్లిప్లను షేర్ చేసింది. HarKaamDeshKeNaam అనే హ్యాష్ ట్యాగ్ను జోడించింది. ఈ ఎన్వీజీ సాంకేతికత సాయంతో తక్కువ వెలుగులో ఐఏఎఫ్ మరింత సమర్థతతో ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుపడుతుంది.
ఒక క్లిప్లో ఎన్వీజీ సహాయంతో విమానం సజావుగా ల్యాండ్ కావడం కనిపించింది. ఎయిర్క్రాఫ్ట్ లోపలి నుంచి వ్యూ ఎలా ఉంటుందో మరో వీడియోలో పంచుకుంది. ‘‘దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునే ప్రక్రియలో భాగంగా మా సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని ఈ సందర్భంగా ఐఏఎఫ్ తెలిపింది. అవి ఎన్వీజీ విజువల్స్ కావడంతో ఆ దృశ్యాలన్ని ఆకుపచ్చ రంగులో భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒడిశా, ఝార్ఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు తూర్పు సెక్టార్ పరిధిలోకి వస్తాయి. చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్తో కూడిన 6,300 కి.మీ. అంతర్జాతీయ సరిహద్దుకు బాధ్యత వహిస్తుంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఈ సెక్టార్లో సైన్యం బలోపేతంపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. దానిలో భాగంగా ఈ సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. ఇదివరకు నియంత్రణ రేఖ వద్ద కార్గిల్ ఎయిర్స్ట్రిప్ మీద కూడా ఈ విమానం రాత్రివేళ విజయవంతంగా ల్యాండ్ అయింది. తక్కువ స్థలంలోనే ల్యాండింగ్, టేకాఫ్ కావడం C-130J ప్రత్యేకత.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీనాబ్ నదిపై చికుబుకు రైలు
జమ్మూకశ్మీర్ వెళ్లే పర్యాటకులు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో ఇకపై చీనాబ్ రైల్వే వంతెన కూడా చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. -
నీట్ పేపర్ లీక్లో బిహార్ ముఠా
దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశ పరీక్ష 2024’లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు వార్తలొచ్చాయి. వీటిని కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తోసిపుచ్చింది. -
సమాజసేవ కోసం పెళ్లి మానుకొని.. అనాథ శవాలకు అంత్యక్రియలు
హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాకు చెందిన సతీశ్ చోప్రా (47) సాటి మనుషులకు సాయం చేయడం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. -
‘బంగళాల కోసం చెట్లను కొట్టనీయం’..
వీవీఐపీల బంగళాల నిర్మాణం కోసం కొట్టేస్తారని భావిస్తున్న 27 వేల చెట్ల సంరక్షణ కోసం భోపాల్లో వందలమంది ఆందోళనకారులు చేతులు కలిపారు. -
ఝార్ఖండ్ రైలు దుర్ఘటనలో.. ప్రాణాలు కాపాడిన చాయ్వాలా
అగ్నిప్రమాదం వదంతులతో ఝార్ఖండ్ వద్ద జరిగిన రైలు దుర్ఘటనలో చాయ్ అమ్మే వ్యక్తి ఒకరు పలువురు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఆ సమయంలో అతడు హెచ్చరించకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగేది. -
‘పబ్జీ’ ప్రియుడి కోసం.. భారత్కు అమెరికా యువతి
పబ్జీ ఆడుతూ ప్రేమలో పడి భారత్కు వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ తరహాలోనే మరో ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఈసారి అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఉత్తర్ప్రదేశ్కు వచ్చిన యువతిని ఇటావా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
8 ఏళ్ల కుమార్తె తోడుగా సైకిలుపై చార్ధామ్ యాత్ర
గుజరాత్కు చెందిన తండ్రీకూతుళ్లు సైకిలుపై చార్ధామ్ యాత్ర చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె కంగర్ కృష్ణతో కలిసి ద్వారక, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించుకున్న అశోక్ జీనా బాయ్ త్వరలో నేపాల్లోని పశుపతినాథ్, రామేశ్వరంలోని శివుణ్ని దర్శించుకోనున్నట్లు తెలిపారు. -
కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని సృష్టించొద్దు
దేశంలోని కార్పొరేట్ సంస్థల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని, ఒకరినొకరు అణచివేసుకునే ధోరణితో అది సాగకూడదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సూచించారు. ఈ తరహా పోటీ కార్పొరేట్ గుత్తాధిపత్యానికి దారితీయకుండా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. -
దిల్లీ నీటి సంక్షోభంపై కాంగ్రెస్ ‘మట్కా ఫోడ్’
దేశ రాజధాని నగరమైన దిల్లీలో నెలకొన్న నీటిసంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ నగరవ్యాప్తంగా రోడ్లపై మట్టికుండలు పగలగొడుతూ (మట్కా ఫోడ్) ఆందోళనలు చేపట్టింది. శనివారం ఉదయం 10.00 గంటల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు నెత్తిన కుండలు పెట్టుకొని, పార్టీ జెండాలతో ప్రదర్శనలు జరిపారు. -
కళ్లలో కారం కొట్టి కర్రలతో ప్రొఫెసర్పై దాడి
తప్పుడు పనులు చేయొద్దని వారించినందుకు కక్ష పెంచుకున్న కొందరు విద్యార్థులు తమ ప్రొఫెసర్పై దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటుచేసుకుంది. ఇక్కడి ప్రభుత్వ జె.హెచ్. పీజీ కళాశాలలోకి శుక్రవారం సాయంత్రం ఏడుగురు విద్యార్థులు వచ్చారు. -
మణిపుర్ సీఎం నివాసం సమీపంలో అగ్నిప్రమాదం
మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ అధికారిక నివాసం సమీపంలోని ఓ నివాస భవనంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవనం ఓ దివంగత ఐఏఎస్ అధికారి కుటుంబానిది. -
సంక్షిప్త వార్తలు (5)
ఈ ఉరుకుల పరుగుల ప్రపంచాన్ని ఒంటరితనం కమ్మేస్తోంది. వృత్తి, వయసు, సంపాదన ఇత్యాది కారణాలతో నిమిత్తం లేకుండా ఎంతోమంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. -
కేజ్రీవాల్ ఆడియో, వీడియోలను తొలగించండి
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 28న కోర్టులో మాట్లాడుతున్నప్పటి వీడియోలు/ఆడియో రికార్డులను సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి తొలగించాలని ఆయన సతీమణి సునీతను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. -
వందేభారత్ స్లీపర్ ప్రయోగాత్మక పరుగు పంద్రాగస్టుకు
రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే వందేభారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైళ్ల ప్రయోగాత్మక పరుగును ఆగస్టు 15 నాటికి నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. -
18న పీఎం కిసాన్ నిధుల విడుదల
పీఎం కిసాన్ 17వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 18న రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
నీట్-యూజీ పరీక్ష రద్దు చేయాలి
నీజీ-యూజీ (2024) పరీక్షను రద్దు చేయాలని, పరీక్ష నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ లేదా ఇతర స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
పాక్ నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా
పాకిస్థాన్ నుంచి భారత్లోని రాజస్థాన్లో ఉన్న అనూప్గఢ్ జిల్లాకు డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తోన్న 12 కిలోల మాదక ద్రవ్యాలను సరిహద్దు భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వీటి విలువ రూ.60కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. -
అలకనంద నదిలో పడ్డ టెంపో
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై వెళ్తున్న టెంపో వాహనం శనివారం జారి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా 12 మంది గాయపడ్డారు. -
జులైలో జీశాట్-ఎన్2 ప్రయోగం
ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న జీశాట్-ఎన్2 (జీశాట్-20) ఉపగ్రహాన్ని జులై రెండో వారంలో ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. -
కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్పై 25.92 శాతంగా ఉన్న అమ్మకపు పన్నును 29.84 శాతానికి, డీజిల్పై ఉన్న పన్నును 14.3 శాతం నుంచి 18.4 శాతానికి పెంచింది. -
పుణె కారు ప్రమాదం.. మైనర్కు బెయిల్ మంజూరులో లోపాలు!
పుణె కారు ప్రమాదం కేసులో మైనర్కు బెయిల్ వ్యవహారంలో అనేక విధానపరమైన లోపాలు, నిబంధనలు పాటించకపోవడం వంటివి విచారణ కమిటీ గుర్తించినట్లు ఓ అధికారి వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
-
స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు.. సూపర్8కు ఇంగ్లాండ్
-
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష