Pannun murder plot: ‘పన్నూ హత్యకు కుట్ర’ కేసు దర్యాప్తులో భారత్ సహకరించింది: అమెరికా ప్రతినిధి
ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్రకేసు దర్యాప్తులో ఇప్పటి వరకు భారత్ పూర్తిగా సహకరించిందని అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టీ వెల్లడించారు.
ఇంటర్నెట్డెస్క్: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసులో భారత్ ఇప్పటి వరకు పూర్తిగా సహకరించిందని అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టీ కొనియాడారు. ఈ అంశంపై ఇరుదేశాలు సంయుక్తంగా దర్యాప్తుపై పనిచేస్తున్నాయని వివరించారు. ‘‘ఇప్పటి వరకు మేము అడిగిన ప్రతి ఒక్కదాన్ని భారత ప్రభుత్వం పూర్తి చేసిందని అనుకొంటున్నాను. సాధారణంగా ఎటువైపు నుంచైనా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు తీవ్రంగానే పరిగణిస్తాం. ఎవరికైనా ఓ రెడ్లైన్ ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా, ప్రభుత్వోద్యోగి అయినా మా పౌరుడిపై హత్యాయత్నంలో భాగస్వామి అయితే.. దానిని ఏమాత్రం అంగీకరించం’’ అని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘భారత్ దీనిపై సంయుక్త ఎంక్వైరీ కమిషన్ను వేసినందుకు సంతోషించాను. దానిలో సీనియర్ అధికారులను నియమించింది. వారు ఈ కుట్రకేసులో దేశీయంగా ఆధారాల సేకరణపై దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ప్రభుత్వ ఏజెంట్లు ఎవరైనా ఉన్నారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అమెరికా కూడా ఇలానే తమ పౌరులు పరాయి దేశాల్లో హత్యలకు కుట్ర చేస్తే దర్యాప్తు చేస్తుంది. ఇలాంటి వాటిల్లో మా ప్రభుత్వ సిబ్బంది ఉన్నా అంగీకరించం’’ అని గార్సెట్టీ స్పష్టం చేశారు.
పన్నూ అంశం అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ప్రచారాన్ని గార్సెట్టీ కొట్టిపారేశారు. ఖలిస్థానీల ఆగడాల విషయంలో వాషింగ్టన్ చూసీచూడనట్లు ఉంటోందన్న విషయాన్ని తోసిపుచ్చారు. భారత్లో ఖలిస్థానీ వేర్పాటువాదం చరిత్ర అమెరికాకు తెలుసని వ్యాఖ్యానించారు. క్రిమినల్ నెట్వర్కుల్లోని వ్యక్తులను అదుపు చేసే విషయంపై కలిసి పనిచేస్తున్నామన్నారు. ‘‘మేము నేరగాళ్ల బహిష్కరణలు, అప్పగింతలపై కలిసి పనిచేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమన్వయం సాగుతోంది. సంపూర్ణ విశ్వాసం లేకపోతే ఇది ఎలా సాధ్యం’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.