PM Modi: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ మనదే: ప్రధాని మోదీ

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ భారత్‌లో ఉందని ప్రధాని మోదీ తెలిపారు. 

Published : 20 Mar 2024 13:25 IST

దిల్లీ: దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు (Startups) కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. మూడోవిడత అధికారంలోకి వచ్చాక భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. దిల్లీలోని భారత మండపంలో ‘స్టార్టప్‌ మహాకుంభ్‌’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

‘‘1.25 లక్షల స్టార్టప్‌లు, 110 యూనికార్న్‌లతో భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది. సరైన సమయంలో కచ్చితమైన నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు రోడ్‌మ్యాప్‌ రూపొందించాం. దేశ యువత స్టార్టప్‌ల ద్వారా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టి పెట్టుబడులను ఆకర్షించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగారు. దేశంలో 45 శాతం స్టార్టప్‌లను నడిపిస్తున్నది మహిళలే. మధ్యంతర బడ్జెట్‌లో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.లక్ష కోటి బడ్జెట్‌  కేటాయించడం స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం’’ అని ప్రధాని తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రధాని రాజకీయాల్లో స్టార్టప్‌లపై ఛలోక్తులు విసిరారు. ‘‘చాలా మంది స్టార్టప్‌లను ప్రారంభిస్తారు. రాజకీయాల్లో ఇవి ఎక్కువ. ప్రతిసారీ కొత్త స్టార్టప్‌లు ప్రారంభించాల్సిందే. కానీ, మీ స్టార్టప్‌లకు రాజకీయాల్లో వాటికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ప్రయోగాత్మకంగా వ్యవహరిస్తారు. ఒక ఆలోచన కార్యరూపం దాల్చకుంటే మరో ఐడియాతో ముందుకు సాగుతారు’’ అని మోదీ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని