Jaishankar: అప్పట్లోనే 38 వేల చ.కి.మీ. భూమిని కోల్పోయాం - జైశంకర్
చైనా, పాకిస్థాన్ (Pakistan) మినహా అన్ని పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు గతంతో పోలిస్తే మరింత మెరుగయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.
తిరువనంతపురం: చైనా, పాకిస్థాన్ (Pakistan) మినహా అన్ని పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు గతంతో పోలిస్తే మరింత మెరుగయ్యాయని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. తిరువనంతపురంలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో భారత్ దౌత్య సంబంధాలపై మాట్లాడిన ఆయన చైనా (China)తో భారత్ సంబంధాలు సవాళ్లతో కూడుకున్నదన్నారు. అయినప్పటికీ దేశ ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యం, విశ్వాసం మనకు ఉందన్నారు.
చైనా, పాక్ మినహా..
‘‘ప్రస్తుతం చైనాతో సంబంధాలు అంతంతమాత్రమే. పాకిస్థాన్తోనూ అంతే. ఈ రెండింటినీ మినహాయిస్తే.. బంగ్లాదేశ్ సహా ఇతర పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. దేశ ప్రయోజనాలను ముందుకుతీసుకెళ్లగల, రక్షించుకోగల సామర్థ్యం, విశ్వాసం మనకు ఉంది. ఈ పోటీ ప్రపంచంలో మేమూ పోటీ పడతాం’ అని జైశంకర్ పేర్కొన్నారు. దేశం చుట్టూ ఉన్న చిన్న దీవుల్లో చైనా జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగించే విషయమా? అన్న ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఈవిధంగా స్పందించారు.
పొరుగుదేశాలను అడగండి
‘‘బంగ్లాదేశ్కు వెళ్లి వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో అడగండి. శ్రీలంకనూ ఆరా తీయండి. వాళ్లు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటునప్పుడు వారికి ఎవరు అండగా నిలిచారు? కొవిడ్ సమయంలో వ్యాక్సిన్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని నేపాల్ను అడగండి. ఉక్రెయిన్ సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ఎరువులు, ఇంధనం ఎవరు ఇచ్చారని ప్రశ్నించండి’’ అని జైశంకర్ మాట్లాడారు. సమస్యలు సృష్టించే శక్తులు పొరుగునే ఉండొచ్చని, వాటిని ఇష్టపడే వ్యక్తులు భారత్లోనూ ఉండే అవకాశం ఉందన్నారు.
పీవోకేపై స్పష్టమైన వైఖరి
భాజపా పాలనలో చైనాకు భారత్ తన భూభాగం కోల్పోయిందని వస్తోన్న ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ‘‘1962లో 38 వేల చ.కి.మీ. భూభాగాన్ని కోల్పోయాం. కానీ, 2000 తర్వాత మనం భూమి కోల్పోయామని ఆరోపించడం సరైంది కాదు’’ అని చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)పై భాజపా ఇస్తోన్న ఎన్నికల హామీపై స్పందించిన ఆయన.. ‘‘భారత్లో పీవోకే భాగం కాదనే విషయాన్ని ఎప్పటికీ అంగీకరించమంటూ భారత పార్లమెంటు (Parliament) ఓ తీర్మానం చేసింది. దానిని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి. ఇదే జాతీయస్థాయి వైఖరి’’ అని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ