S Somanath: దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
ఆలయాల్లో లైబ్రరీలు ఏర్పాటుచేయడం ద్వారా యువతను దేవాలయాల వైపు ఆకర్షించవచ్చని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు.
తిరువనంతపురం: యువత ప్రార్థనా స్థలాలకు రావడానికి ఆసక్తి చూపించాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO ) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ (Somanath) అన్నారు. ఈ విధంగా గ్రంథాలయాల ఏర్పాటుతో యువతను ఆకర్షించవచ్చని ఆయన సలహా ఇచ్చారు.
తిరువనంతపురంలోని శ్రీ ఉడియన్నూర్ దేవి ఆలయం సభ్యులు సోమనాథ్ను సన్మానించారు. ఇస్రో మాజీ ఛైర్మన్ జి.మాధవన్ నాయర్ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. అనంతరం సోమనాథ్ మాట్లాడుతూ ‘ఈ అవార్డు ప్రదానోత్సవానికి యువకులు పెద్దసంఖ్యలో వస్తారని నేను ఊహించాను. కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆలయ నిర్వాహకులు వారిని దేవాలయాల వైపు ఆకర్షించడానికి కృషి చేయాలి. ఇందుకోసం దేవాలయాల్లో లైబ్రరీలను ఎందుకు ఏర్పాటుచేయకూడదు?’’అని ఆయన ప్రశ్నించారు. ఆలయాలు కేవలం వృద్ధులు వచ్చి దేవుడిని తలుచుకునేవిగానే కాకుండా సమాజాన్ని మార్చే ప్రభావవంతమైన ప్రదేశాలుగా మారాలని ఆయన పేర్కొన్నారు.
ఈవిధంగా చొరవ తీసుకోవడం వల్ల ధార్మిక విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనుకునేవారు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతారని ఆయన తెలిపారు. సాయంత్రం వేళల్లో వివిధ అంశాలపై చర్చలు ఏర్పాటుచేస్తే యువకులు తమ అభివృద్ధికి బాటలు వేసుకునేందుకు దోహదపడుతుందని సోమనాథ్ విశ్వాసం వ్యక్తంచేశారు. ఆలయ నిర్వాహకులు ఆ దిశగా కృషి చేస్తే సమసమాజంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా కుమారుడి వివాహం.. వారం రోజులు వేడుకలు
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని అతడు స్వయంగా ఇన్స్టాలో వెల్లడించాడు. -
‘నాన్నా.. ఒక్కసారి రావా’: 9 నెలల క్రితమే అమరుడైన తండ్రి కోసం చిన్నారి వాయిస్ మెసేజ్లు
ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే ఆపరేషన్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయారు కర్నల్ మన్ప్రీత్ సింగ్. ఆయన కుమారుడు ఇప్పటికీ తన తండ్రి జీవించే ఉన్నారనే అనుకుంటున్నాడు. -
ఎప్పుడూ ఏకగ్రీవం.. మరి ఈసారి..
లోక్సభలో స్పీకర్ పదవిని అధికార పక్షం, ఉప సభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా ఈసారి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. సభ నిర్వహణలో కీలకమైన సభాపతి పదవిని తనవద్దే అట్టిపెట్టుకోవాలని భాజపా కోరుకుంటున్నట్లు సమాచారం. -
ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణలో మార్పులు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో పదేళ్ల సర్వీసు పూర్తవకుండానే ఉద్యోగుల పింఛను స్కీం(ఈపీఎస్)లో జమైన మొత్తాన్ని ఉపసంహరించుకునే వారికి వచ్చే డబ్బులు ఇకపై కొంతమేరకు తగ్గనున్నాయి. ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణ చెల్లింపుల గణాంక టేబుల్ను ఈపీఎఫ్వో పూర్తిగా మార్చేయడమే ఇందుకు కారణం. -
నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు
పీఎం కిసాన్ 17వ విడత నిధుల్ని మంగళవారం వారణాసి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20వేల కోట్లు జమ కానున్నాయి. -
పారదర్శకతకు పాతర!
కేంద్ర ప్రభుత్వం నియమించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే) పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సందర్భంగా పారదర్శకత పాటించకపోవడంతో ఏటా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తిప్పలు తప్పడం లేదు. -
ప్రయాణికుడి ఆహారంలో ‘బ్లేడ్’ నిజమే.. అంగీకరించిన ఎయిర్ ఇండియా
తమ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్ (లోహపు ముక్క) వచ్చినట్లు ఎయిర్ ఇండియా సోమవారం అంగీకరించింది. తమ క్యాటరింగ్ భాగస్వామికి చెందిన ఆహార తయారీ కేంద్రంలో కూరగాయలను తరిగే యంత్రం నుంచి అది ఊడిపడిందని ఓ ప్రకటనలో వివరించింది. -
త్వరలో మైతేయ్, కుకీలతో చర్చలు: అమిత్ షా
జాతుల మధ్య ఘర్షణలతో అశాంతి నెలకొన్న మణిపుర్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోనుంది. ఆ రాష్ట్రంలోని వైరి పక్షాలైన మైతేయ్, కుకీ వర్గాల ప్రజలతో త్వరలో చర్చలు జరిపి వైషమ్యాలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. -
వ్యూహాత్మక సాంకేతిక బంధం మరింత బలోపేతం
భారత్, అమెరికాల మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక సాంకేతిక బంధం మరింత బలోపేతానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య అన్ని రంగాల్లో బంధం బలోపేతం కావడానికి జరుగుతున్న వేగవంతమైన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. -
తక్షణం రాజ్భవన్ విడిచి వెళ్లండి.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
పశ్చిమ బెంగాల్లో గవర్నర్- రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకీ ముదురుతోంది. రాజ్భవన్ వద్ద ఉన్న కోల్కతా పోలీసు సిబ్బంది పనితీరుపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని రాజ్భవన్ పరిసరాలు విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు. -
యూపీఎస్సీ ప్రిలిమ్స్.. టాప్-10లో పఢ్ఏఐ యాప్!
కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. యూపీఎస్సీ ప్రిలిమినరీ-2024 పరీక్షలో ఏఐ ఆధారంగా పనిచేసే ‘పఢ్ఏఐ’ యాప్ 200కుగానూ 170 మార్కులు సాధించింది. మొత్తం పరీక్షను కేవలం ఏడు నిమిషాల్లోనే పూర్తిచేసింది కూడా. -
2,500 ఏళ్ల క్రితం భూకంపంతో మారిన గంగానది ప్రవాహం
ప్రపంచంలోని పెద్ద నదులలో ఒకటైన గంగానది సుమారు 2,500 సంవత్సరాల క్రితం తన ప్రవాహ దిశను మార్చుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. భారీ భూకంపం కారణంగానే ఇలా జరిగిందని పరిశోధకులు అంచనా వేశారు. -
ఐఐటీ ఖరగ్పుర్లో విద్యార్థిని ఆత్మహత్య
ఐఐటీ ఖరగ్పుర్లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. బయోటెక్నాలజీ మూడో ఏడాది చదువుతున్న దేవికా పిళ్లై (21) తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. -
దిల్లీలో రెండు గంటలు నిలిచిన ఇండిగో విమానం
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇండిగో విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడిన ఘటన దిల్లీ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. విమానం 6ఈ 2521 దిల్లీ నుంచి బెంగాల్లోని బాగ్డోగ్రా బయలుదేరేందుకు సిద్ధమైంది. -
రైలు పట్టాలపై 10 సింహాలు.. బ్రేకులు వేసి వాటిని రక్షించిన రైలు డ్రైవర్
రైలు వేగంగా వెళ్తోన్న సమయంలో పట్టాలపైకి ఒకేసారి పది సింహాలు వచ్చిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన లోకోపైలట్.. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. -
రూ.5 లక్షలు పెట్టి టికెట్ కొన్నా సేవలు పేలవం
ఎయిరిండియా విమాన ప్రయాణంలో పీడకలలాంటి అనుభవం ఎదురైందని వినీత్ అనే ప్రయాణికుడు నెట్టింట అసహనం వ్యక్తం చేశారు. దిల్లీ నుంచి న్యూజెర్సీ వెళ్లిరావడానికి రూ.5 లక్షలు పెట్టి బిజినెస్ క్లాస్ టికెట్ కొన్నా..సంస్థ అందించిన సేవలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. -
రైల్వే ట్రాక్పై 10 సింహాలు.. లోకోపైలట్ ఏం చేశారంటే!
రైల్వే ట్రాక్పైకి ఒకేసారి పది సింహాలు వచ్చిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
విజయవాడలో క్యాంపు కార్యాలయం.. పరిశీలించిన పవన్
-
అమెరికా అధ్యక్షుడి పర్యటన.. భద్రతా సిబ్బందిని దోచుకొన్న దొంగలు
-
అమరావతి, పోలవరం పూర్తి చేయడమే మా ప్రధాన లక్ష్యం: పల్లా శ్రీనివాసరావు యాదవ్
-
‘అప్పుడు మోదీ దాచిపెట్టారా..?’: వయనాడ్ నుంచి ప్రియాంక పోటీపై భాజపాకు కాంగ్రెస్ కౌంటర్
-
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..