Rahul Gandhi: పీఎల్ఏ అధీనంలో ఉన్న భూమి ఎవరిది? : రాహుల్ గాంధీ
భారత్ భూభాగంలోకి ఎవరూ రాలేదన్న కేంద్రం ప్రకటనతో రాహుల్ గాంధీ (Rahul gandhi) విభేదించారు. మరోవైపు రష్యా- ఉక్రెయిన్ విషయంలో భారత్ విదేశాంగ విధానాలకు మద్దతిస్తున్నట్లు చెప్పారు.
దిల్లీ: చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రి జైశంకర్కు అర్థం కావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదన్న ప్రధాని మోదీ ప్రకటన.. చైనాకు ఆహ్వానం పలికేలా ఉందని వ్యాఖ్యానించారు. లండన్లోని భారత జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత విదేశాంగ విధానానికి మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానాలిచ్చారు. ‘ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో భారత్ స్తబ్ధుగా ఉంది. ఎవరి పక్షమూ వహించలేదు. ఒకవేళ చైనా, పాకిస్థాన్లు భారత్పై దండెత్తి వస్తే.. అప్పుడు ప్రపంచ దేశాలు కూడా పట్టనట్టు ఉంటాయి కదా?’ అని విలేకరులు అడగ్గా.. ఈ విషయంలో భారత విదేశాంగ విధానానికి తాను మద్దతిస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ విషయంలో భారత్ సరైన విధానాన్నే అనుసరించిందని చెప్పారు. దాంతో పెద్దగా విభేదించాల్సిన అవసరం లేదన్నారు.
2వేల చదరపు కి.మీ భూమి ఎవరిది?
భారత్లోకి చొరబాట్లు జరిగే ప్రసక్తే లేదని మోదీ చెబుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘చొరబాట్లు జరగకపోవడం ఏంటి? ఇప్పటికే 2 వేల చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) స్వాధీనం చేసుకుంది. కానీ, మోదీ మాత్రం ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా భారత్ కోల్పోలేదని చెబుతున్నారు. ఇప్పుడు పీఎల్ఏ చేతుల్లో ఉన్న భూభాగం భారత్ది కాదా?’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సరిహద్దులో చైనీయులు విద్వేష పూరితంగా, దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న రాహుల్... భారత్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. చైనాతో కాంగ్రెస్ విధానంపై మాట్లాడుతూ.. భారత్ భూ భాగంలోకి ఎవరినీ రానివ్వకుండా చేయడమే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. ‘‘చైనా విషయంలో కాంగ్రెస్ విధానం చాలా స్పష్టంగా ఉంది. భారత్ భూభాగంలోకి ప్రవేశించేందుకు ఎవరినీ అనుమతించబోం. వాళ్లు ఎవరైనా సరే.. ఉపేక్షించేది లేదు. గతంలో భారత్ భూభాగంలోకి వచ్చిన చైనా దళాలు. భారత సైనికుల ప్రాణాలు తీశాయి. కానీ, దీనిని ప్రధాని మోదీ విస్మరించారు.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
అంతకుముందు చైనా అంశంలో కేంద్ర ప్రభుత్వం తీరును రాహుల్ గాంధీ తప్పుబట్టడంపై భాజపా తీవ్రంగా స్పందించింది. లద్దాఖ్లో ఘటన జరిగిన తర్వాత అక్కడ సైన్యాన్ని మోహరించింది కాంగ్రెస్ నేతలు కాదని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ విమర్శించారు. ప్రధాని మోదీయే స్వయంగా పరిస్థితిని సమీక్షించి అక్కడికి సేనలను పంపారని అన్నారు. చరిత్రను గుర్తుంచుకోవాలన్న జై శంకర్.. 1962లో ఏ జరిగిందో తెలుసుకుంటే మంచిదని రాహుల్ గాంధీకి హితవు పలికారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. చైనా దళాలు భారత్ భూభాగం వైపు దూసుకొస్తుంటే ఏం చేసిందని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..