ఎంసీఏ విద్యార్థిని దారుణ హత్య.. కాంగ్రెస్ కార్పొరేటర్కు జేపీ నడ్డా పరామర్శ
కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా(23)ను ఇటీవల హుబ్బళ్లిలో ఫయాజ్ అనే యువకుడు కిరాతకంగా హత్య చేసిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పరామర్శించారు.
హుబ్బళ్లి: తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు ఇటీవల కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటనపై కర్ణాటకలోని పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హుబ్బళ్లిలో బాధిత కుటుంబాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పరామర్శించారు. విద్యార్థిని తండ్రి హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హీరేమఠ ఇంటికి వెళ్లిన నడ్డా.. ఆ దంపతులను కలిసి ధైర్యం చెప్పారు. నడ్డా వెంట కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ, పలువురు భాజపా నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది షాకింగ్ ఘటన. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం సిద్ధరామయ్య, హోం మంత్రి జి.పరమేశ్వర చేసిన స్టేట్మెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. వారి ప్రకటనలు దర్యాప్తును నీరుగార్చేలా ఉన్నాయి. బుజ్జగింపు రాజకీయాలను కర్ణాటక ప్రజలు ఉపేక్షించరు. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలి’’ అని డిమాండ్ చేశారు.
బంద్కు పిలుపునిచ్చిన ముస్లిం సంస్థలు
మరోవైపు, నేహా (23)ను కిరాతకంగా హత్య చేసిన ఘటనను పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థిని హత్యకు నిరసనగా ఏప్రిల్ 22 (సోమవారం)న స్థానికంగా బంద్కు పిలుపునిచ్చాయి. బాధిత కుటుంబానికి సంఘీభావంగా తాము బంద్ను పాటిస్తున్నట్లు ధార్వాడ్కు చెందిన అంజుమన్-ఇ-ఇస్లామ్ అధ్యక్షుడు ఇస్మాయిల్ టమట్గర్ వెల్లడించారు. ముస్లిం వర్గానికి చెందిన వ్యాపారులంతా సోమవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు బంద్లో పాల్గొంటారన్నారు. మాంసం దుకాణాలు, గ్యారేజ్ వర్క్షాప్లు, పండ్ల వ్యాపారులు, బ్యాంకులు, పలు సంస్థలు మూసివేస్తామని పేర్కొన్నారు. తమ దుకాణాల వద్ద ‘జస్టిస్ ఫర్ నేహా’ స్టిక్కర్లను అతికించడంతో పాటు ర్యాలీ కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇలాంటి దారుణాలు మరే ఆడబిడ్డలపైనా జరగకూడదనే సందేశాన్ని ఇవ్వడమే తమ నిరసన ఉద్దేశమని పేర్కొన్నారు.
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
ఏప్రిల్ 18న హుబ్బళ్లిలోని బీవీబీ కాలేజీ క్యాంపస్లో హుబ్బళ్లి పాలికె కార్పొరేటర్ నిరంజన్ హీరేమఠ కుమార్తె నేహా (23)ను ఫయాజ్ అనే యువకుడు కత్తితో కిరాతకంగా పొడిచి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కత్తితో తొమ్మిదిసార్లు దాడి చేసిన కిరాతక ఘటనపై హుబ్బళ్లి, ధార్వాడ్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితుడిని ఉరితీయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు ఫయాజ్ను అరెస్టు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్