Politics: టూరింగ్ టాకీసులలో ‘అశ్లీల చిత్రాలు’.. హెచ్డీకే - డీకేఎస్ మాటల యుద్ధం
డీకే శివకుమార్కు చెందిన టూరింగ్ టాకీసులలో (Cinema Halls) గతంలో ‘అశ్లీల సినిమాలు’ ప్రదర్శించేవారంటూ హెచ్డీ కుమారస్వామి చేసిన ఆరోపణలను డిప్యూటీ సీఎం తిప్పికొట్టారు.
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DKS), మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (HDK)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. డీకే శివకుమార్కు చెందిన టూరింగ్ టాకీసులలో (Cinema Halls) గతంలో ‘అశ్లీల సినిమాలు’ ప్రదర్శించేవారంటూ హెచ్డీ కుమారస్వామి ఆరోపణలు చేయడం తాజా వివాదానికి కారణమయ్యింది. దీన్ని తిప్పికొట్టిన డిప్యూటీ సీఎం డీకేఎస్.. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానంటూ సవాల్ విసిరారు.
‘దొడ్డనహళ్లిలోని ఓ థియేటర్లో ప్రదర్శించే సినిమాల మధ్యలో అశ్లీల క్లిప్పులను వేసే ఒక నేత ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు’ అంటూ జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ఇటీవల ఆరోపించారు. తాజాగా మారోసారి ఇదే విషయంపై స్పందించిన కుమారస్వామి.. తన పేరుతో ఇటీవల పోస్టర్లు అంటించడంపై మండిపడ్డారు. దొడ్డనహళ్లి, శతానుర్లలో అశ్లీల సినిమాలు ప్రదర్శించే వ్యక్తి (డీకే శివకుమార్) తీరు ఇలాగే ఉంటుందని దుయ్యబట్టారు. దీంతో ఇద్దరు అగ్రనేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
దీనిపై డీకే శివకుమార్ స్పందించారు. ఇదే వ్యవహారంపై బెంగళూరులో విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కుమారస్వామిని చూస్తుంటే బాధగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో నాలాంటి వ్యక్తిని కేబినెట్లోకి ఎందుకు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. ‘నా సొంత నియోజకవర్గం కనకపురకు స్వయంగా వెళ్లి.. ఆ థియేటర్లో ఏ సినిమాలు ఆడుతున్నాయి? అటువంటి సినిమాలు ప్రదర్శించానా? లేదా? అనే విషయాన్ని అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలి’ అని బదులిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1.23 లక్షలకు పైగా ఓట్లతో కనకపుర ప్రజలు తనను ఎన్నుకున్నారని.. కర్ణాటకలోనే ఇదో రికార్డు అని పేర్కొన్నారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గతంలో సినిమా హాళ్లను నిర్వహించేవారు. దొడ్డనహళ్లి, హరుబిలి, కొదిహళ్లితోపాటు హునేసహళ్లి ప్రాంతాల్లో టూరింగ్ టాకీస్లు ఉండేవి. హునేసహళ్లిలో ప్రస్తుతం ఒక టాకీస్ ఇంకా నడుస్తోందని డీకే శివకుమార్ స్వయంగా వెల్లడించారు. అవి తనపేరు మీదే ఉన్నాయని.. అందులో ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు.
ఇదిలాఉంటే, దీపావళి రోజున దీపాల అలంకరణ కోసం స్తంభం నుంచి నేరుగా విద్యుత్తు తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రూ.68వేలు జరిమానా చెల్లించారు. డెకరేటర్ చేసిన తప్పిదాన్ని తనపై వేసుకుని బాధ్యతగా జరిమానా చెల్లించానని కుమారస్వామి స్పష్టం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తనను లక్ష్యంగా చేసుకుని విద్యుత్తు చోరుడు అంటూ పోస్టర్లు వేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.