Lokayukta: కర్ణాటక లంచం కేసు.. భాజపా ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్
లంచం (Corruption) కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్పకు (Virupakshappa) కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడితో సహా ఐదుగురిని లోకాయుక్త ఇప్పటికే అరెస్టు చేసింది.
బెంగళూరు: కర్ణాటకలో (Karnataka) భాజపా ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ లోకాయుక్త (Lokayukta) చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే మదాల్ విరూపాక్షప్పకు (Virupakshappa) కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లంచం కేసులో ప్రశాంత్తో సహా ఐదుగురిని లోకాయుక్త అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే విరూపాక్షప్ప (Virupakshappa) తరఫునే ప్రశాంత్ లంచం తీసుకున్నారని లోకాయుక్త (Lokayukta) అనుమానిస్తోంది. దీంతో ఈ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చింది. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే ఆచూకీ మాత్రం లభించలేదు. ఇదే సమయంలో ఈకేసులో తన పాత్ర లేదని పేర్కొంటూ విరూపాక్షప్ప హైకోర్టులో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని మంగళవారం విచారించిన జస్టిస్ కే నటరాజన్ ఏకసభ్య ధర్మాసనం.. ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేసింది.
ఈ సందర్భంగా ఆర్డరు కాపీ అందిన 48 గంటల్లోగా విచారణ అధికారి ముందు హాజరు కావాలని విరూపాక్షప్పను హైకోర్టు ఆదేశించింది. రూ.5లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. బెయిల్ పొందిన నేపథ్యంలో ఎటువంటి ఆధారాలను చెడగొట్టేందుకు ప్రయత్నించవద్దని ఆదేశించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.
ఓ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ లోకాయుక్తకు చిక్కారు. ప్రశాంత్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరపగా.. సుమారు రూ.8కోట్లకు పైగా నగదు లభ్యమైంది. నగదుతోపాటు పెద్ద ఎత్తున భూముల పెట్టుబడులకు సంబంధించి డాక్యుమెంట్లతోపాటు బంగారం, వెండి కూడా గుర్తించినట్లు లోకాయుక్త వర్గాలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి