Marriage: హద్దులు దాటి వధువుకు ‘కిస్సు’.. కర్రలతో కొట్టుకున్న ఇరు కుటుంబాలు
కల్యాణ వేదికపై బహిరంగంగా వధువును వరుడు ముద్దుపెట్టుకోవడం వివాదాన్ని రాజేసింది. ఇరు కుటుంబీకులు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.
లఖ్నవూ: వరుడి విపరీత చర్యతో కల్యాణ వేదిక రణరంగంగా మారింది. వరమాల క్రతువు పూర్తయిన తర్వాత వధువును అతడు బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం వివాదానికి కారణమైంది. చివరకు ఇరువర్గాల వారు కర్రలతో దాడి చేసుకునేవరకు వెళ్లింది. ఉత్తర్ప్రదేశ్లోని హాపూర్లో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను హాపూర్లోని అశోక్నగర్లో ఏర్పాటుచేశాడు. ఒక కుమార్తె వివాహం ఎలాంటి ఇబ్బందీ లేకుండా పూర్తయింది. అది పూర్తయిన కొద్దిసేపటి తర్వాత మరో కుమార్తె లగ్నం జరుగుతోంది. వరమాల వేయడం పూర్తయిన తర్వాత వరుడు, వధువుకు బహిరంగంగా ముద్దు పెట్టాడు. ఇది ఆమె బంధువులకు నచ్చలేదు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అంతలోనే వధువు బంధువులు కొందరు స్టేజీ పైకి చేరుకొని వరుడు, అతడి కుటుంబసభ్యులపైన దాడికి దిగారు. ఇరువర్గాల వారు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో కల్యాణవేదిక కాస్తా, రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులైన ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె నిరాకరిస్తున్నా అందరిముందు ముద్దు పెట్టుకున్నాడని వధువు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆమె అంగీకారంతోనే ముద్దు పెట్టానని వరుడు చెబుతున్నాడు. ఈ ఘటనపై రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బాధితులెవరైనా ముందుకొస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. అయితే, ప్రజాశాంతికి భంగం కలిగించినందుకుగాను ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
వందేభారత్ స్లీపర్ ట్రయల్ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో అతి త్వరలో ఈ రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
పుణె కారు ప్రమాదం.. మైనర్కు బెయిల్ మంజూరులో లోపాలు!
పుణె కారు ప్రమాదం కేసులో మైనర్కు బెయిల్ వ్యవహారంలో అనేక విధానపరమైన లోపాలు, నిబంధనలు పాటించకపోవడం వంటివి విచారణ కమిటీ గుర్తించినట్లు ఓ అధికారి వెల్లడించారు. -
భాజపాదీ ‘రిక్షా’ పరిస్థితే.. అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది: ఉద్ధవ్ ఠాక్రే
కేంద్రంలోని మోదీ సర్కార్పై శివసేన (యూబీటీ) అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. -
వాహనదారులకు కర్ణాటక భారీ షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలపై వాత
Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. -
పేపర్ లీక్కు రూ.30 లక్షలు: ‘నీట్’ దర్యాప్తులో సంచలనాలు..!
NEET paper Leak: నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు కొంతమంది అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు తెలిసింది. బిహార్లో చేపట్టిన దర్యాప్తు వల్ల ఈ సంచలన విషయాలు బయటపడినట్లు సమాచారం. -
మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్యూ మోదీజీ: శరద్ పవార్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు నిర్వహించిన నియోజకవర్గాల్లో మహా వికాస్ అఘాడీ విజయం సాధించిందని ఎన్సీపీ (ఎస్సీపీ) నేత శరద్ పవార్ అన్నారు. -
‘ఇందిరాగాంధీ మదర్ ఆఫ్ ఇండియా’.. కేంద్ర మంత్రి సురేశ్ గోపీ వ్యాఖ్యలు
Suresh Gopi: భాజపా ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీని మదర్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. -
లోయలో పడిన టెంపో.. 10 మంది మృతి
23 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఉత్తరాఖండ్లో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. -
దయచేసి దిల్లీకి నీరు విడుదల చేయండి: ఆప్ నేత ఆతిశీ
దేశ రాజధాని తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటుందని, హరియాణా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నీరు విడుదల చేయాలని దిల్లీ మంత్రి ఆతిశీ కోరారు. -
వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి.. పీఎం-కిసాన్ నిధులు
PM Kisan 17th installment: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్న్యూస్. జూన్ 18వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్ చుక్ పరుగులు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణపనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
రాష్ట్రం కోసం నీతీశ్ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్ కిషోర్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్..8మంది నక్సల్స్ మృతి
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. -
‘ఆ వీడియో తొలగించండి’: సునీతా కేజ్రీవాల్కు దిల్లీ కోర్టు నోటీసులు
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో విషయంలో సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal)కు దిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. -
అనుచిత వ్యాఖ్యలు చేసి.. యూటర్న్ తీసుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్ సీనియర్ల నుంచి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు వెలువడ్డాయి. అవి వివాదాస్పదం కావడంతో తాజాగా వివరణ వచ్చింది. -
అక్రమాలు జరిగితే ఎన్టీఏను జవాబుదారీ చేస్తాం
పరీక్షల నిర్వహణలో అక్రమాలను తమ ప్రభుత్వం సహించబోదని, ఒక వేళ లోపాలు జరిగినట్లు తేలితే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని జవాబుదారీ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. -
బుల్లెట్ రైలులో ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ
బుల్లెట్ రైలు సేవలను సురక్షితంగా నిర్వహించేందుకు ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ(రెయిన్ఫాల్ మానిటరింగ్ సిస్టమ్)ను అవలంబిస్తున్నామని శుక్రవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. -
శివునికి ఎవరి రక్షణా అవసరం లేదు
యమునా నది వరదకు గురయ్యే తీర భూమిలో గల ప్రాచీన శివాలయాన్ని కూల్చివేయాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది. -
త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు జమిలి ఎన్నికల కమిటీ నివేదిక
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు రానుంది. -
భాజపాతో ఆరెస్సెస్కు విభేదాల్లేవు.. సంఘ్ వర్గాల వెల్లడి
భాజపాతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు ఎటువంటి విభేదాల్లేవని సంబంధిత వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2014, 2019 లోక్సభ ఎన్నికల తరవాత ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన ప్రసంగానికి తాజాగా ఆయన మాట్లాడిన మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదని పేర్కొన్నాయి. -
అమెరికాలో వర్క్ పర్మిట్దారుల పిల్లలను ఆదుకోండి
అమెరికాకు వర్క్పర్మిట్పై వచ్చిన దంపతుల పిల్లల(డ్రీమర్ల)కు 21 ఏళ్లు నిండగానే వారివారి దేశాలకు తిప్పిపంపేయకుండా తక్షణం రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు 43 మంది శాసనకర్తలు విజ్ఞప్తి చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు
-
కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?