శ్రీరామ నవమి వేళ అయోధ్యకు 1,11,111 కిలోల లడ్డూలు

శ్రీరామ నవమి వేడుకల వేళ అయోధ్య రామాలయానికి లక్షకు పైగా కిలోల లడ్డూలను పంపించనున్నట్లు దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు వెల్లడించింది

Updated : 14 Apr 2024 19:38 IST

Ayodhya Ram temple| మీర్జాపుర్‌: అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram temple) నిర్మాణం తర్వాత తొలిసారి జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 17న జరగనున్న ఉత్సవాల్లో రాములోరి ప్రసాదంగా భక్తులకు పంచేందుకు భారీ సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా 1,11,111 కిలోల లడ్డూలను రామాలయానికి పంపనున్నట్లు యూపీలోని మీర్జాపుర్‌లో దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు వెల్లడించింది. కాశీ విశ్వనాథ్‌ లేదా తిరుపతి వేంకటేశ్వరస్వామి వంటి ఆలయాలకు ప్రతి వారం తాము లడ్డూ ప్రసాదాన్ని పంపుతామని  ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగిన రోజు సైతం ఈ ఆశ్రమం నుంచి 40వేల కిలోల లడ్డూ ప్రసాదం పంపినట్లు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని