RajyaSabha: రాజ్యసభలో గరం గరం.. ఖర్గే, గోయల్ మాటల తూటాలు!
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్య రాజ్యసభలో మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇద్దరు నేతలూ పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.
దిల్లీ: బిహార్ (Bihar), ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రాల్లో ఇటీవల తలెత్తిన రాజకీయ సంక్షోభంపై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన తర్వాత.. ఝార్ఖండ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు 2 రోజుల సమయం పట్టగా.. బిహార్లో మాత్రం ఈ ప్రక్రియ గంటల వ్యవధిలోనే జరిగిపోయిందని ఖర్గే అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్.. ఆ చేత్తో రాజీనామా లేఖ ఇచ్చి.. ఈ చేత్తో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేశారని అన్నారు. ఎంత ప్రయత్నించినా ఝార్ఖండ్లో భాజపా కుతంత్రాలు పని చేయలేదని ఎద్దేవా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ కూడా నిబంధనల మేరకు నడుచుకోలేదని ఆరోపించారు.
‘ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరాలి. అది లేదు సరికదా.. కనీసం సీఎం రాజీనామా చేసినట్లు రాజ్భవన్ ప్రకటన కూడా విడుదల చేయలేదు’ అని ఖర్గే అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు జేఎంఎం సారథ్యంలో సంకీర్ణ పక్షాల ఎమ్మెల్యేలు అనుమతి కోరితే తాత్సారం చేశారని ఆరోపించారు. రాజీనామాకు ముందే హేమంత్ సోరెన్ శాసనసభాపక్ష నేతగా చంపయీ సోరెన్ను ఎంపిక చేసినప్పటికీ.. ఆయన సీఎంగా ప్రమాణం చేసేందుకు 2 రోజుల సమయం పట్టిందన్నారు.
దీనిపై పీయూష్ గోయల్ స్పందిస్తూ.. అవినీతి కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లిన హేమంత్ సోరెన్ను హస్తం పార్టీ ఇప్పటికీ వెనకేసుకు రావడం ఆశ్చర్యపరుస్తోందన్నారు. అవినీతికి పాల్పడిన నేతను వెనకేసుకొస్తున్నారంటే ఆ పార్టీ వైఖరి ఎంటో ప్రజలకు అర్థమవుతోందని విమర్శించారు. ఝార్ఖండ్లో చోటుచేసుకున్న పరిణామాలపై గవర్నర్ చట్టబద్ధంగానే వ్యవహరించారన్నారు. 2018లో కాంగ్రెస్ నేతలు సంతకాల ఫోర్జరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని అడగడం కేవలం కాంగ్రెస్కే చెల్లిందని, అది భాజపా వల్ల కాదని ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!