Mamata Banerjee: ఇందిరాగాంధీ చంద్రుడి వద్దకు చేరుకున్నప్పుడు..! మరోసారి తడబడిన మమత
భారత్ చేపట్టిన చంద్రయాన్-3(chandrayaan 3) ప్రయోగం విజయవంతమైంది. దీని గురించి మాట్లాడుతూ పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మరోసారి తడబడ్డారు.
కోల్కతా: పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(West Bengal CM Mamata Banerjee) మరోసారి తడబాటుకు గురయ్యారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చంద్రుడిపైకి వెళ్లారంటూ వ్యాఖ్యానించి నెట్టింట ట్రోలింగ్కు గురయ్యారు. ఇటీవల భారత అంతరిక్ష సంస్థ(ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయం గురించి వెల్లడిస్తూ.. ఆమె ఇదే తరహాలో మాట్లాడిన సంగతి తెలిసిందే.
టీఎంసీ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 ప్రయోగం గురించి మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సోవియట్ యూనియన్కు చెందిన రాకెట్లో భారత్కు చెందిన రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, దీనిపై తడబడిన దీదీ.. ‘ఇందిరా గాంధీ చంద్రుడి వద్దకు చేరుకున్నప్పుడు.. అక్కడి నుంచి హిందుస్థాన్ ఎలా ఉందని రాకేశ్ను అడిగారు. ప్రపంచంలోనే ఉత్తమంగా ఉందని ఆయన బదులిచ్చారు’ అంటూ మాట్లాడేశారు. వాస్తవానికి రాకేశ్ శర్మ వెళ్లింది అంతరిక్షంలోకి.. కానీ ఆమె మాత్రం చంద్రుడిపైకి అని ప్రస్తావించారు. అదీనూ ఇందిరాగాంధీ వెళ్లారని ప్రస్తావించడం గమనార్హం. దీంతో ఆమె వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల చంద్రయాన్-3 విజయవంతమైన సందర్భంలో కూడా ఇలాగే మమత మాట్లాడుతూ.. రాకేశ్ శర్మ గురించి ప్రస్తావించారు. అయితే.. రాకేశ్ శర్మకు బదులు.. రాకేశ్ రోషన్ అని అన్నారు. దాంతో బాలీవుడ్ నటుడు, నిర్మాత రాకేశ్ రోషన్ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చారు. ఆయన ఫొటోతో నెట్టింట్లో మీమ్స్ హల్చల్ చేశాయి.
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 (chandrayaan 3) ప్రయోగంలో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండర్ సురక్షితంగా దిగింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి తన అధ్యయనాన్ని ప్రారంభించింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో భారత్కు ప్రపంచవ్యాప్తంగా అభినందన సందేశాలు వెల్లువెత్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.