Uttar Pradesh: నాడు ప్రధాని మోదీపై పోటీ చేసిన గ్యాంగ్స్టర్.. మళ్లీ ఇప్పుడు వార్తల్లో ఎందుకు..?
2019 ఓ గ్యాంగ్స్టర్ ప్రధాని నరేంద్రమోదీపై పోటీచేసి చిత్తుగా ఓడిపోయాడు. తాజాగా ఇప్పుడు అతడి పేరు ఓ హత్యకేసులో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. యూపీ పోలీసులు ఇప్పటికే అతడి అనుచరులు ఇద్దర్ని ఎన్కౌంటర్ చేశారు.
ఇంటర్నెట్డెస్క్: యూపీలో హంతకులపై మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ ఎమ్మెల్యే హత్యకేసులోని ముఖ్య సాక్షిని అంతమొందించిన షార్ప్షూటర్ను యూపీ పోలీసులు నేడు ఎన్కౌంటర్ చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్పాల్ హత్యకేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్పాల్ను గతనెల 24 వతేదీ సాయంత్రం ప్రయాగ్రాజ్లో పట్టపగలే హంతకులు కాల్చి చంపారు. ఆయన తన అంగరక్షకులతో కలిసి ఇంటివద్దకు చేరుకోగానే తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉమేశ్ అంగరక్షకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ పరిణామాలు మాజీ ఎంపీ అతీక్ అహ్మద్వైపు వేలెత్తి చూపాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీని కుదిపేసింది. ‘అహ్మద్ వంటి మాఫియా, క్రిమినల్స్ని నిర్మూలిస్తాం’ అని యూపీ సీఎం యోగినే సభలో ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాదు.. నిందితులపై ప్రభుత్వం రూ.2.5 లక్షల రివార్డు ప్రకటించింది. ఇది జరిగిన రోజుల్లోనే ఉమేశ్పాల్ హత్యకేసులో ఇద్దరు కీలక నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
తమ్ముడిని ఓడించాడని ఎమ్మెల్యేనే హత్యచేయించినట్లు ఆరోపణలు
ప్రయాగ్రాజ్(నాటి అలహాబాద్) పశ్చిమ స్థానం నుంచి అతీక్ అహ్మద్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004-09 వరకు ఫూల్పూర్ ఎంపీగా బాధ్యతలు నిర్వహించాడు. ప్రయాగ్రాజ్ వ్యవసాయ పరిశోధనశాలలో సిబ్బందిపై దాడి కేసులో 2016 నుంచి గుజరాత్లోని ఓ జైల్లో ఉన్నాడు. 1989లో అహ్మద్ తొలిసారి అలహాబాద్ వెస్ట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లో కూడా విజయం సాధించాడు. 1996లో సమాజ్వాదీ పార్టీలో చేరి ఎమ్మెల్యే స్థానం నిలబెట్టుకొన్నాడు. మూడేళ్ల తర్వాత అప్నాదళ్లో చేరి 2002 ఎన్నికల్లో విజయం సాధించాడు. 2004లో సమాజ్వాదీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో ఫూల్పూర్ నుంచి విజయం సాధించాడు. దీంతో అతడు ఎమ్మెల్యేగా ఉన్న అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గంలో సోదరుడు అష్రఫ్ను నిలబెట్టాడు. కానీ, బీఎస్పీ అభ్యర్థి రాజుపాల్ చేతిలో అష్రఫ్ ఓడిపోయాడు. అప్పటి వరకు అతీక్ కుటుంబానికి కోటలా ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గం చేజారిపోయింది.
2005 జనవరిలో రాజుపాల్ తన సహచరులతో కలిసి ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు కాల్చిచంపారు. ఈ హత్యలో అష్రఫ్ సహా, సోదరుడు అతీక్, షాహిస్తా పర్వీన్ పేర్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అష్రఫ్ ఎన్నికల్లో విజయం సాధించాడు. 2008లో పోలీసుల ఒత్తిడి కారణంగా అతీక్ అహ్మద్ పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత సమాజ్వాదీ టికెట్పై విజయం సాధించలేదు. ఆ తర్వాత నుంచి అఖిలేశ్ యాదవ్ కూడా అతడిని దూరం పెట్టడం మొదలుపెట్టారు. రాజ్పాల్ కేసులో ఉమేశ్ పాల్ ప్రధాన సాక్షి. తాజాగా ఉమేశ్ను చంపిన బృందంలో అర్బాజ్ అనే వ్యక్తి అతీక్ అహ్మద్కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. 2006లో ఉమేశ్ను అతీక్ మనుషులు కిడ్నాప్ చేశారు. అప్పట్లో అతీక్కు అనుకూలంగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలని అతడిపై తీవ్ర ఒత్తిడి చేశారు.
కిడ్నాప్ చేయించి.. జైలుకు రప్పించి..
2017లో అతీక్ అహ్మద్ ప్రయాగ్ రాజ్లోని ఓ అగ్రికల్చర్ యూనివర్శిటీలో సిబ్బందిపై దాడి చేశాడు. ఈ కేసులో అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి డియోరియా జైల్లో ఉండగా.. ఓ వ్యాపార వేత్తను కిడ్నాప్ చేయించి.. జైలుకు తీసుకొచ్చి దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అతడిని బరేలీ జైలుకు.. ఆ తర్వాత 2019లో అహ్మదాబాద్ జైలుకు తరలించారు.
2019లో మోదీపై పోటీ.. 855 ఓట్లు..
అతీక్ అహ్మద్పై పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన 2019లో వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడ ఆయనకు 855 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతీక్ అహ్మద్ పై మొత్తం 70 వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం