‘వాటర్ బాటిల్’పై కేసు.. ఐదేళ్ల తర్వాత గెలుపు
రెస్టారెంట్లలో, సినిమా థియేటర్లలో ఆహార పదార్థాలు, మంచినీటి బాటిళ్ల ధర ఆకాశాన్ని అంటుతాయన్న విషయం తెలిసిందే. చాలా మంది ఎందుకంతా ధర అని ప్రశ్నించకుండానే కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ, రోహిత్ పాటిల్ అలా ఊరుకోలేదు. ఓ రెస్టారెంట్కు వెళ్లిన రోహిత్కు
ఇంటర్నెట్ డెస్క్: రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో ఆహార పదార్థాలు, మంచినీటి బాటిళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయన్న విషయం తెలిసిందే. చాలా మంది ఎందుకంతా ధర అని ప్రశ్నించకుండానే కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ.. రోహిత్ పాటిల్ అలా ఊరుకోలేదు. ఓ రెస్టారెంట్కు వెళ్లిన రోహిత్కు వాటర్ బాటిల్పై వేసిన బిల్లు చూసి చిర్రెత్తుకొచ్చింది. రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీశాడు. వారు సరిగా స్పందించకపోవడంతో వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించారు. ఐదేళ్ల నిర్విరామ న్యాయపోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించాడు.
గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన 67 ఏళ్ల రోహిత్ పాటిల్ ఐదేళ్ల కిందట.. అంటే 2015 అక్టోబర్ 16న తన స్నేహితులతో కలిసి ఎస్జీ హైవేలోని ఓ హోటల్కు వెళ్లాడు. నచ్చిన ఆహారం, వాటర్ బాటిల్ ఆర్డర్ చేసుకొని తిన్నాడు. తీరా బిల్లు చూస్తే వాటర్ బాటిల్కు రూ.164 వేశారు. మొదట రోహిత్ ఆ ధర చూసి పొరపాటుగా అచ్చు అయిందనుకున్నాడట. సిబ్బందిని అడిగితే వాటర్ బాటిల్ ధర అంతేనని స్పష్టం చేశారు. దీంతో ఆశ్చర్యపోవడం రోహిత్ వంతయింది. రూ.20 ఖరీదు చేసే వాటర్ బాటిల్కు అంత ధర ఏంటని హోటల్ యాజమాన్యాన్ని రోహిత్ నిలదీశాడు. చాలా సేపు వాదించాడు. అయినా హోటల్ యాజమాన్యం తగ్గకపోవడంతో రోహిత్ బిల్లు మొత్తాన్ని చెల్లించక తప్పలేదు.
కోర్టులో కేసు..
అయితే.. హోటల్ దోపిడీని ఎలాగైనా అడ్డుకోవాలని రోహిత్ బలంగా నిర్ణయించుకున్నాడు. హోటల్ నుంచి వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్, దాని బిల్లు ఆధారంగా అదే ఏడాది నవంబర్ 3న వినియోగదారుల ఫోరమ్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు కావడంతో హోటల్ యాజమాన్యానికి నోటీసులు వెళ్లాయి. హోటల్ తరఫు న్యాయవాది కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. వాటర్ బాటిల్కు రూ.164 బిల్లు వేయడం తప్పేమీ కాదని.. హోటల్లో అందించే సేవలకు తగ్గట్టుగానే ధర ఉందని చెప్పుకొచ్చారు. అలా ఇరువైపుల వాదనలు ఐదేళ్లపాటు కొనసాగాయి. ఈ క్రమంలో రోహిత్ 28 సార్లు కోర్టు మెట్లు ఎక్కిదిగాడు. ఎంతో మంది ఈ చిన్న విషయానికి కేసులు, కోర్టులు ఎందుకు.. వదిలేయమని రోహిత్తో చెప్పారట. కానీ, ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
తుది తీర్పు..
ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 5న ఫోరం.. రోహిత్కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఒక వాటర్ బాటిల్కు అంత ధర ఉండటం అన్యాయమని, ఎంఆర్పీ ధర కంటే భారీ మొత్తంలో అధికంగా రుసుము వేయడం నేరంగా పేర్కొంది. వేధింపులకు గురిచేసినందుకుగానూ రూ.2,500, ఇతర ఖర్చులకుగానూ రూ.3,000 మొత్తంగా రూ.5,500 పరిహారంగా బాధితుడు రోహిత్కు ఇవ్వాలని కోర్టు హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల లోపే చెల్లించాలని పేర్కొంది. కోర్టు తీర్పుతో రోహిత్ సంతృప్తి చెందాడు. హోటల్ ఇచ్చే పరిహారం మొత్తాన్ని ఏదైన స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం