lok sabha election 2024: మావోయిస్టుల గూడులో తొలిసారి పోలింగ్..!
మావోయిస్టులు ఝార్ఖండ్లో విముక్త ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అధికారులు ఈసారి సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఓటర్లు జీవితంలో తొలిసారి ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: మావోయిస్టుల కంచుకోటగా పేరున్న ప్రదేశంలో తొలిసారి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఝార్ఖండ్ ‘సింహ్భూమ్’ (Singhbhum) పార్లమెంట్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో 118 పోలింగ్ బూత్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడికి పోలింగ్ బృందాలను, సామగ్రిని హెలికాప్టర్లలో తరలించనున్నారు. ఇక్కడ మే13న ఎన్నికలు జరగనున్నాయి. ఆసియాలోని అత్యంత చిక్కటి సాల్ అడవి కేంద్రమైన సరండేలో ఈ సారి పోలింగ్ నిర్వహించడం ఈసీకి సవాలే.
‘‘ఒక్క ఓటరు కూడా పోలింగ్కు దూరం కాకూడదనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం. మావోయిస్టు వేర్పాటు వాదం బలపడిన ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తొలిసారి మరికొన్ని చోట్ల రెండు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. మేము వెళ్లని ప్రాంతం ఉండదని చెబుతున్నాను’’ అని పశ్చిమ సింహ్భూమ్ జిల్లా కలెక్టర్ కుల్దీప్ చౌద్రీ పీటీఐకి తెలిపారు. ఇక్కడి నుగ్డి, బొరెరో ప్రాంతాల్లోని ప్రజలు జీవితంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఏడాదిలో 22 మరణాలు..
పశ్చిమ సింహ్భూమ్ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఇక్కడ గతేడాది మొత్తం 46 తీవ్రవాద ఘటనలు చోటుచేసుకోగా.. 22 మంది మరణించారు. గతంలో మావోలు ఇక్కడి తాల్కోబాద్ ప్రాంతంలోని 22 గ్రామాలను విముక్త ప్రదేశాలుగా ప్రకటించారు. కానీ, భద్రతా దళాలు నిరంతరం ఆపరేషన్లు నిర్వహించి పట్టు సాధించాయి. ఈ ప్రాంతంలో మొత్తం 15 క్యాంపులను ఏర్పాటు చేశాయి. ప్రజలకు ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ‘‘118 బూత్లున్న రోబోకేరా, బింజ్, తాల్కోబాద్, జరాయికేలా,హంసబేడా, రెంగ్రాథూ, ఛోటానగర్ వంటి చోట్ల సామగ్రిని ఎయిర్డ్రాప్ చేస్తాం. కొన్ని పోలింగ్ పార్టీలు రోడ్డు మార్గంలో వెళనున్నాయి. ఇక 121 బృందాలను రైళ్లలో తరలించనున్నాం. డ్రైరన్స్ పూర్తయ్యాయి. ఈ ప్రాంతంలో 100 ఏళ్లు దాటిన 62 మంది ఓటర్లు ఉండటం విశేషం. ఇక్కడి వృద్ధులు, వికలాంగులు ఇళ్ల వద్దే ఓటు హక్కు వినియోగించుకొనేలా ఏర్పాట్లు చేశాం. ప్రజలకు అవగాహన కల్పించేందుకు 1,284 చునావ్ పాఠశాలలను నిర్వహించాం’’ అని జిల్లా కలెక్టర్ కుల్దీప్ వెల్లడించారు.
సింహ్భూమ్ ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి మధుకోడా సతీమణి గీతా గతంలో గెలిచారు. ఈ సారి భాజపా టికెట్పై ఆమె బరిలోకి దిగనున్నారు. ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.