Shraddha Murder: శ్రద్ధా హత్య కేసు.. డీఎన్ఏ నివేదిక ఆలస్యమెందుకో..?
శ్రద్ధా హత్య కేసులో డీఎన్ఏ నివేదిక ఆలస్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదిక ఆలస్యం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దిల్లీ: సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ ఆమిన్ పూనావాలను అరెస్టు చేసి రెండు వారాలకు పైనే అయ్యింది. నిందితుడు చెప్పిన వివరాల మేరకు శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర భాగాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి మృతురాలివేనా? అని చెప్పేందుకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి ఆధారాల్లేవు. దీన్ని తేల్చేందుకు చేపట్టిన డీఎన్ఏ పరీక్షల నివేదిక ఇంతవరకూ రాకపోవడంపై ఫోరెన్సిక్ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబ్బంది కొరత కారణంగానే జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతుండటం గమనార్హం.
శ్రద్ధా హత్య కేసులో ఆఫ్తాబ్ను నవంబరు 12న దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర అవశేషాలను గుర్తించిన పోలీసులు వాటిని నవంబరు 13న డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో వచ్చిన డీఎన్ఏతో శ్రద్ధా కుటుంబ సభ్యుల డీఎన్ఏను సరిపోల్చి.. అవి మృతురాలివా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక ఇంతవరకూ రాలేదు. దీనిపై అధికారులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. ‘‘ఇలాంటి కేసుల్లో మేం అత్యంత గోప్యత పాటిస్తాం. అందుకే ఆ శరీర భాగాల గురించి బయటకు ఎలాంటి వివరాలు చెప్పట్లేదు’’ అని రోహిణి ప్రాంత ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అసిస్టెంట్ పీఆర్ఓ రజనీశ్ కుమార్ చెప్పారు.
అయితే నివేదిక ఆలస్యంపై ఫోరెన్సిక్ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘మానవ అవశేషాలు భద్రపర్చని స్థితిలో ఉన్నా.. ఏడాది క్రితం నాటివైనా వాటి నుంచి డీఎన్ఏను తెలుసుకునేందుకు 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. ఆరు నెలల తర్వాత లభించిన మృతదేహాలకు చర్మం, మాంసం లేకపోయినా ఎముకల్లో ఉండే మజ్జ లాంటి కణజాలం ఏడాది వరకు సజీవంగానే ఉంటుంది. దాంతో సులువగానే డీఎన్ఏను తెలుసుకోవచ్చు’’ అని బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన జెనెటిక్స్ ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే అన్నారు. 2021లో జార్జియా రాణి కెటెవాన్ 400 ఏళ్ల హత్య మిస్టరీని డీఎన్ఏ ద్వారా ఛేదించిన బృందంలో చౌబే కూడా సభ్యుడిగా ఉన్నారు. శ్రద్ధా కేసులో డీఎన్ఏ పరీక్షలు ఆలస్యమవడం దురదృష్టకరమని, దీని వల్ల ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. ఈ కేసులో డీఎన్ఏను ఐసోలేట్ చేయడం బహుశా సవాల్గా మారొచ్చని మరో ఫోరెన్సిక్ నిపుణులు డా. తంగరాజ్ అన్నారు. అయితే ఇలాంటి కేసుల్లోనూ డీఎన్ఏను గుర్తించేందుకు మూడు రోజులకు మించి పట్టదని తెలిపారు.
సిబ్బంది కొరత వల్లేనా..?
అయితే రాష్ట్ర ప్రభుత్వ లాబొరేటరీల్లో సిబ్బంది కొరత కారణంగానే ఈ నివేదికలు ఆలస్యమవుతున్నాయని ఫోరెన్సిక్ అధికారులు చెబుతున్నారు. శ్రద్ధా కేసును చేపట్టిన ఎఫ్ఎస్ఎల్ రోహిణి లాబొరేటరీలో వర్క్ లోడ్కు తగినంత డీఎన్ఏ నిపుణులు అందుబాటులో లేరని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సగం మందితోనే ఈ లాబొరేటరీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ కేసులు ఎక్కువగా ఉండటం, ప్రాధాన్యత క్రమాల వల్లే ఈ నివేదిక ఆలస్యమవుతున్నట్లు సమాచారం.
ఆఫ్తాబ్కు భారీ భద్రత..
సోమవారం ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం ఆఫ్తాబ్ను ల్యాబ్ నుంచి జైలుకు తరలిస్తుండగా కొందరు వ్యక్తులు కత్తులతో పోలీసు వ్యాన్పై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడికి భద్రతను పెంచారు. మంగళవారం ఉదయం మిగతా ఫోరెన్సిక్ పరీక్షల కోసం అతడిని మరోసారి ఎఫ్ఎస్ఎల్ రోహిణి ల్యాబ్కు తరలించారు. భారీ భద్రత మధ్య అతడిని ఇక్కడకు తీసుకొచ్చారు. ల్యాబ్ ముందు కూడా భారీగా పోలీసులు మోహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’