Satyendar Jain: ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. తిహాడ్ జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం అనుమతిచ్చింది.
దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తిహాడ్ జైల్లో ఉన్న ఆ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ అనుమతిచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ చేత దర్యాప్తు కోరుతూ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా దర్యాప్తునకు అనుమతిచ్చింది. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేందర్ జైన్ తన నుంచి బలవంతంగా రూ.10 కోట్లు వసూలుచేశారన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపణలపై ఈ దర్యాప్తు జరగనుంది. ఓవైపు ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉండగా.. తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఇంతకీ ఏమిటీ కేసు..?
జైల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు గానూ గతంలో జైళ్ల శాఖ మంత్రిగా సత్యేందర్ జైన్ తన నుంచి రూ.10 కోట్లు బలవంతంగా తీసుకున్నారని సుకేశ్ ఆరోపణ. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్కు అతడు లేఖ రాశాడు. ఈ వ్యవహారంలో జైన్ సహా తిహాడ్ జైలు మాజీ డీజీ సందీప్ గోయెల్ నిందితులుగా ఉన్నారు. ‘2015 నుంచి సత్యేంద్రజైన్తో నాకు పరిచయం ఉంది. దక్షిణాదిలో కీలక పదవి అప్పగిస్తానని, పార్టీ విస్తరణ తర్వాత రాజ్యసభకు నామినేట్ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాకు హామీ ఇచ్చింది. అందువల్ల ఆ పార్టీకి నేను రూ.50 కోట్లకు పైగా డబ్బు సమకూర్చాను. 2017లో నేను అరెస్టయిన తర్వాత తిహాడ్ జైల్లో ఉంచారు. అప్పుడు జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ నన్ను కలిశారు. ఆమ్ఆద్మీ పార్టీకి ఇచ్చిన డబ్బు గురించి దర్యాప్తు సంస్థలకు ఏమైనా చెప్పావా? అని అడిగారు. ఆ తర్వాత 2019లో మరోసారి అరెస్టయినప్పుడు సత్యేంద్రజైన్ తన సెక్రటరీ, మరో సన్నిహితుడితో జైలుకు వచ్చి నన్ను కలిశారు. జైల్లో రక్షణ, సదుపాయాలు కల్పించాలంటే ప్రతినెలా తనకు రూ.2 కోట్లు కట్టాలని జైన్ డిమాండ్ చేశారు. అంతేగాక డీజీ (జైళ్లు) సందీప్ గోయెల్కు ప్రతినెలా రూ.1.5 కోట్లు ఇవ్వాలని చెప్పారు. నాపై ఒత్తిడి పెంచి కొన్ని నెలలు బలవంతంగా కట్టించుకున్నారు. అలా సత్యేంద్ర జైన్కు రూ.10కోట్లు, సందీప్ గోయెల్కు రూ.12.5 కోట్లు చెల్లించా’’ అని సుకేశ్ తన లేఖలో పేర్కొన్నాడు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. సత్యేంద్ర జైన్ కూడా అవినీతి కేసులో అరెస్టయి ప్రస్తుతం తిహాడ్ జైల్లోనే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!