‘అమృత్ మహోత్సవ్’కు మోదీ శ్రీకారం
దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం శ్రీకారం చుట్టారు. గుజరాత్లోని
అహ్మదాబాద్: దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం శ్రీకారం చుట్టారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో గల సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నిర్వహించే పాదయాత్రను ఆయన నేడు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమృత్ మహోత్సవ్ వెబ్సైట్ను ఆయన ప్రారంరభించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను మోదీ స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో దేశంలోని అన్ని వర్గాలు పాల్గొన్నాయని, ఆ పోరాట స్ఫూర్తిని దేశం ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్ యావత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందని కొనియాడారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో స్వావలంబన సాధించడంతో పాటు ఇతర దేశాలకు కూడా అందించే స్థాయికి ఎదిగామన్నారు.
దండి మార్చ్ వార్షికోత్సవం సందర్భంగా నేడు ఈ పాదయాత్ర చేపట్టారు. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దండియాత్ర ప్రారంభమైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ సబర్మతి ఆశ్రమం నుంచి నవసారిలోని దండి వరకు 81 మంది 241 మైళ్ల దూరం పాదయాత్ర చేయనున్నారు. 25రోజుల పాటు సాగనున్న ఈ పాదయాత్ర ఏప్రిల్ 5న ముగియనుంది. ఆ రోజున దండిలో భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
75ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు గుర్తుగా కేంద్రం ‘అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం చేపట్టింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి కానుంది.
బాపూజీకి నివాళి..
అమృత్ మహోత్సవ్ ప్రారంభోత్సవం కోసం ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న మోదీ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అభయ్ ఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను ప్రధాని తిలకించారు.
‘స్థానికం’ కోసం గళమెత్తుదాం
అంతకుముందు ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. స్థానిక వస్తువులు కొని వాటిని వోకల్ ఫర్ లోకల్ యాష్ ట్యాగ్తో సోషల్మీడియాలో పోస్ట్చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడమే గాంధీజీకి ఘనమైన నివాళి అని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం