Lancet: క్యాన్సర్ కేసులు అబ్బాయిల్లోనే ఎక్కువ బయటపడుతున్నాయ్.. కారణం ఏంటీ..?
దేశంలో నమోదవుతోన్న క్యాన్సర్ కేసుల్లో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందుకు సమాజంలోని బాలికలపై ఉన్న వివక్ష కూడా ఓ కారణం కావచ్చని అంచనా వేసింది. నిర్ధారణ కేంద్రాలు, చికిత్సకు బాలికలు దూరం కావడంతో.. వీరి సంఖ్య తక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడింది.
దిల్లీ: భారత్లో అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే, ఇందుకు సమాజంలో లింగ వివక్ష ఓ కారణం కావచ్చని అంచనా వేసింది. లక్షణాలున్నప్పటికీ బాలికలను ఆసుపత్రులకు తీసుకువెళ్లకపోవడం కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణమని అభిప్రాయపడింది. యువతలో క్యాన్సర్ కేసులు బయటపడుతున్న తీరుపై భారత పరిశోధకులు జరిగిన అధ్యయన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ ఆంకాలజీలో ప్రచురితమయ్యింది.
క్యాన్సర్ కేసులు నమోదవుతున్న తీరును తెలుసుకునేందుకు దిల్లీ ఎయిమ్స్తోపాటు చెన్నై క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (WIA) పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం దేశంలోని మూడు క్యాన్సర్ ఆసుపత్రుల్లోని బాధితుల రికార్డులను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా జనవరి 1, 2005 నుంచి డిసెంబర్ 31, 2019 వరకు ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు. వీటిని మరో రెండు పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీల (పీబీసీఆర్) సమాచారంతో పోల్చి చూశారు. ఆయా ఆసుపత్రుల్లో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స చేయించుకున్న పురుషులు, స్త్రీల నిష్పత్తిని అంచనా వేశారు. పీబీసీఆర్ల్లో నమోదైన 11వేల బాధితుల రికార్డులను పరిశీలించగా.. క్యాన్సర్ నిర్ధారణ చేయించుకున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక మూడు ఆసుపత్రుల్లో 22వేల క్యాన్సర్ చిన్నారుల రికార్డులను చూడగా.. వాటిలోనూ బాలురు ఎక్కువగా ఉన్నారని ఎయిమ్స్లోని క్యాన్సర్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సమీర్ బక్షీ వెల్లడించారు.
‘లక్షణాలున్నప్పటికీ వందల కి.మీ దూరం నుంచి రావడం, చికిత్సకు ఖర్చు ఎక్కువ అవుతుందనే భయంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికలు నిర్ధారణ పరీక్షకు దూరమవుతున్నారు. బాలికల కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి ఇదీ ఒక కారణం. దీంతో చికిత్స తీసుకునే అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దక్షిణ భారత్తో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో తక్కువ మంది బాలికలు క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారు. ఖర్చు అధికంగా ఉండే ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునే బాలికల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది. ఇదోరకంగా వివక్షే. ఇటువంటి సామాజిక, ఆర్థిక వివక్షను దూరం చేస్తే ఎక్కువ మందికి వ్యాధి నిర్ధారణ చేయవచ్చు’ అని ప్రొఫెసర్ సమీర్ బక్షీ వెల్లడించారు. అయితే, ఈ వివక్ష అనేది కేవలం వ్యాధి నిర్ధారణ వరకేనని.. చికిత్సలో మాత్రం ఎటువంటి వ్యత్యాసం ఉండదని స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, వారి ఆలోచనా విధానంలో మార్పు తేవడం ద్వారా ఈ వివక్షను అధిగమించవచ్చని తాజా అధ్యయనం సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్