Minor Car Driving: యువకుడితో కలిసి లగ్జరీ కారుతో ‘మైనర్’ వీరంగం.. తండ్రి అరెస్ట్!
లగ్జరీ కారు డ్రైవ్ చేసిన ఓ మైనర్ ముంబయి వీధుల్లో హల్చల్ సృష్టించాడు. మైనర్ వాహనం నడుపుతుండగా.. మరో యువకుడు బానెట్పై కూర్చున్నాడు. దీంతో ఆ బాలుడి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.
ముంబయి: మైనర్ల చేతికి వాహనాలు (Minor Car Driving) ఇవ్వడం వల్ల జరిగే దారుణ ప్రమాదాలను చూస్తూనే ఉన్నాం. మహారాష్ట్రలో ఇటీవల ఓ మైనర్ ర్యాష్ డ్రైవింగ్.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయినా.. ఇంకా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ముంబయిలో ఈ తరహా ఘటనే చోటుచేసుకొంది. ఒక మైనర్ బాలుడు లగ్జరీ కారు నడుపుతుండగా.. మరో వ్యక్తి వాహనం ముందు భాగంపై (బానెట్పై) కూర్చున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే..
ముంబయి రద్దీ ప్రాంతాల్లో ఒకటైన శివాజీ చౌక్ వద్ద ఓ మైనర్ బీఎమ్డబ్ల్యూ కారు నడిపాడు. అతడు డ్రైవింగ్ చేస్తుండగా.. సుభమ్ మితాలియా అనే మరో యువకుడు దర్జాగా కారు బానెట్పై కూర్చుని వీడియోకు ఫోజులిచ్చాడు. వీరి వ్యవహారం చూసి అక్కడున్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు.. బాలుడి తండ్రిని అరెస్టు చేశారు. అతడితో పాటు వీడియోలో కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిర్లక్ష్య డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలాఉండగా.. ఇటీవల పుణెలో ఓ మైనర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలుడు ప్రమాదానికి ముందు స్నేహితులతో కలిసి బార్కి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని మరిచిపోకముందే మరో బాలుడు చేసిన వీరంగంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా.. మైనర్లకు వాహనాలు అప్పజెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు
బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు జాప్యం చేస్తున్నారని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై 3 వారాల్లోగా స్పందించాలంటూ కేంద్ర హోంశాఖ, ఆయా గవర్నర్ల... -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?