Salman Khan: సల్మాన్ ఇంటిపై కాల్పులు: విదేశాల్లో కుట్ర.. ముంబయిలో అమలు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనకు విదేశాల్లో కుట్ర జరిగినట్లు బలంగా అనుమానిస్తున్నారు. దీనికి ఓ స్థానిక గ్యాంగ్స్టర్ సహకరించినట్లు తెలుస్తోంది. తాజాగా నిందితుల అరెస్టుతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ఖాన్ (Salman Khan) ఇంటిపై కాల్పుల ఘటనలో దర్యాప్తు వేగవంతమైంది. తాజాగా గుజరాత్లోని భుజ్ జిల్లాలో షూటర్లు వికాస్ గుప్తా (24), సాగర్ పాల్ (21)లను అరెస్టు చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలున్నట్లు నిందితులు అంగీకరించారు. తాజాగా న్యాయస్థానం ఈ ఇద్దరు నిందితులను 10 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది.
తుపాకులు ఏమయ్యాయి..?
బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్లో ఖాన్ ఇంటి బాల్కనీలోకి వీరిద్దరూ గుడ్డిగా ఐదు రౌండ్లు కాల్చారు. ఆ సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నారు. నిందితులిద్దరూ దాడికి ముందు ఆ ఇంటి వద్ద మూడుసార్లు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. కాల్పుల అనంతరం నిందితులు తుపాకులను సూరత్లోని ఓ నదిలో పడేసినట్లు తేలింది. డబ్బుల కోసమే వీరు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
రంగంలోకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్..!
సల్మాన్ ఇంటిపై దాడి ఘటనను ముంబయి క్రైం బ్రాంచ్ తీవ్రంగా పరిగణించింది. జాయింట్ కమిషనర్ (క్రైంబ్రాంచ్) లక్ష్మీ గౌతమ్, ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఇన్స్పెక్టర్ దయానాయక్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. వారు నిన్న సల్మాన్ ఇంటికి స్వయంగా వెళ్లి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో పలు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. మొత్తం 15 బృందాలను ఏర్పాటుచేశారు. చివరికి నిందితులు గుజరాత్లోని భుజ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దయానాయక్ నేతృత్వంలోని క్రైం బ్రాంచ్ ‘యూనిట్ 9’ బృందం వికాస్గుప్తా, సాగర్పాల్ను అదుపులోకి తీసుకొంది. ముంబయిలో మాఫియాను అణగదొక్కిన పోలీసుగా దయానాయక్ పేరు సుపరిచితమే.
ఈ కుట్రకు కెనడాలో మూలాలు..?
కాల్పుల తర్వాత లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ చేసిన ఫేస్బుక్ పోస్టును దర్యాప్తు బృందాలు విశ్లేషించాయి. ఐపీ అడ్రస్ ఆధారంగా శోధించగా.. కెనడా నుంచి ఆ పోస్టు చేసినట్లు తేలింది. ‘సల్మాన్ ఖాన్.. నీకు ట్రైలర్ మాత్రమే చూపించాం. మా సామర్థ్యం నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదే నీకు చివరి వార్నింగ్’’ అని దానిలో హెచ్చరించిన విషయం తెలిసిందే. నిందితులు దర్యాప్తు బృందాలను తప్పుదోవ పట్టించేందుకు వీపీఎన్ వాడి ఆ పోస్టును సృష్టించే అవకాశం లేకపోలేదని అనుమానిస్తున్నారు. ఇక బిష్ణోయ్ గ్యాంగ్ తమ సభ్యులకు వేగంగా సరఫరా చేయడానికి వీలుగా వేర్వేరు రాష్ట్రాల్లో ఆయుధ నిల్వలను ఏర్పాటుచేసుకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులకు రోహిత్ గోదార అనే గ్యాంగ్స్టర్ మనుషుల ద్వారా ఆయుధాలు, బైకు అంది ఉండొచ్చని భావిస్తున్నారు.
ఆ బాల్కనీ నుంచే అభిమానులకు అభివాదం..
బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన సల్మాన్కు గెలాక్సీ అపార్ట్మెంట్తో విడదీయలేని అనుబంధం ఉంది. సంపన్నుడైన ఈ కండల వీరుడు అక్కడ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటాడు. దానికి ఉన్న బాల్కనీ నుంచే అభిమానులకు తరచూ అభివాదం చేస్తుంటాడు. అతడి సోదరులు, సోదరిల పిల్లలు తరచూ ఆడుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ‘‘విలాసవంతమైన భవనాల కంటే బాంద్రా అపార్ట్మెంట్లో ఉండటమే నాకిష్టం’’ అని కొన్నాళ్ల క్రితం ఖాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అది తప్పుడు ప్రచారం : అర్బాజ్ ఖాన్
సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటన తర్వాత తొలిసారి ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. సోదరుడు అర్బాజ్ సోషల్మీడియాలో ఓ పోస్టు పెట్టారు. కాల్పుల ఘటన తమ కుటుంబాన్ని కలచి వేసిందన్నారు. మా ఫ్యామిలీకి సన్నిహితులమంటూ కొందరు మీడియాలో చౌకబారు ప్రకటనలు చేస్తున్నారన్నారు. అదంతా ఓ పబ్లిసిటీ స్టంట్గా అభివర్ణించారు. తమ కుటుంబసభ్యులు ఎవరూ ఈ ఘటనపై ప్రకటనలు చేయలేదన్నారు. ఇప్పుడు దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?