Salman Khan: సల్మాన్ ఇంటిపై కాల్పులు: విదేశాల్లో కుట్ర.. ముంబయిలో అమలు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనకు విదేశాల్లో కుట్ర జరిగినట్లు బలంగా అనుమానిస్తున్నారు. దీనికి ఓ స్థానిక గ్యాంగ్స్టర్ సహకరించినట్లు తెలుస్తోంది. తాజాగా నిందితుల అరెస్టుతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ఖాన్ (Salman Khan) ఇంటిపై కాల్పుల ఘటనలో దర్యాప్తు వేగవంతమైంది. తాజాగా గుజరాత్లోని భుజ్ జిల్లాలో షూటర్లు వికాస్ గుప్తా (24), సాగర్ పాల్ (21)లను అరెస్టు చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలున్నట్లు నిందితులు అంగీకరించారు. తాజాగా న్యాయస్థానం ఈ ఇద్దరు నిందితులను 10 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది.
తుపాకులు ఏమయ్యాయి..?
బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్లో ఖాన్ ఇంటి బాల్కనీలోకి వీరిద్దరూ గుడ్డిగా ఐదు రౌండ్లు కాల్చారు. ఆ సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నారు. నిందితులిద్దరూ దాడికి ముందు ఆ ఇంటి వద్ద మూడుసార్లు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. కాల్పుల అనంతరం నిందితులు తుపాకులను సూరత్లోని ఓ నదిలో పడేసినట్లు తేలింది. డబ్బుల కోసమే వీరు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
రంగంలోకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్..!
సల్మాన్ ఇంటిపై దాడి ఘటనను ముంబయి క్రైం బ్రాంచ్ తీవ్రంగా పరిగణించింది. జాయింట్ కమిషనర్ (క్రైంబ్రాంచ్) లక్ష్మీ గౌతమ్, ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఇన్స్పెక్టర్ దయానాయక్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. వారు నిన్న సల్మాన్ ఇంటికి స్వయంగా వెళ్లి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో పలు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. మొత్తం 15 బృందాలను ఏర్పాటుచేశారు. చివరికి నిందితులు గుజరాత్లోని భుజ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దయానాయక్ నేతృత్వంలోని క్రైం బ్రాంచ్ ‘యూనిట్ 9’ బృందం వికాస్గుప్తా, సాగర్పాల్ను అదుపులోకి తీసుకొంది. ముంబయిలో మాఫియాను అణగదొక్కిన పోలీసుగా దయానాయక్ పేరు సుపరిచితమే.
ఈ కుట్రకు కెనడాలో మూలాలు..?
కాల్పుల తర్వాత లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ చేసిన ఫేస్బుక్ పోస్టును దర్యాప్తు బృందాలు విశ్లేషించాయి. ఐపీ అడ్రస్ ఆధారంగా శోధించగా.. కెనడా నుంచి ఆ పోస్టు చేసినట్లు తేలింది. ‘సల్మాన్ ఖాన్.. నీకు ట్రైలర్ మాత్రమే చూపించాం. మా సామర్థ్యం నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదే నీకు చివరి వార్నింగ్’’ అని దానిలో హెచ్చరించిన విషయం తెలిసిందే. నిందితులు దర్యాప్తు బృందాలను తప్పుదోవ పట్టించేందుకు వీపీఎన్ వాడి ఆ పోస్టును సృష్టించే అవకాశం లేకపోలేదని అనుమానిస్తున్నారు. ఇక బిష్ణోయ్ గ్యాంగ్ తమ సభ్యులకు వేగంగా సరఫరా చేయడానికి వీలుగా వేర్వేరు రాష్ట్రాల్లో ఆయుధ నిల్వలను ఏర్పాటుచేసుకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులకు రోహిత్ గోదార అనే గ్యాంగ్స్టర్ మనుషుల ద్వారా ఆయుధాలు, బైకు అంది ఉండొచ్చని భావిస్తున్నారు.
ఆ బాల్కనీ నుంచే అభిమానులకు అభివాదం..
బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన సల్మాన్కు గెలాక్సీ అపార్ట్మెంట్తో విడదీయలేని అనుబంధం ఉంది. సంపన్నుడైన ఈ కండల వీరుడు అక్కడ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటాడు. దానికి ఉన్న బాల్కనీ నుంచే అభిమానులకు తరచూ అభివాదం చేస్తుంటాడు. అతడి సోదరులు, సోదరిల పిల్లలు తరచూ ఆడుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ‘‘విలాసవంతమైన భవనాల కంటే బాంద్రా అపార్ట్మెంట్లో ఉండటమే నాకిష్టం’’ అని కొన్నాళ్ల క్రితం ఖాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అది తప్పుడు ప్రచారం : అర్బాజ్ ఖాన్
సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటన తర్వాత తొలిసారి ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. సోదరుడు అర్బాజ్ సోషల్మీడియాలో ఓ పోస్టు పెట్టారు. కాల్పుల ఘటన తమ కుటుంబాన్ని కలచి వేసిందన్నారు. మా ఫ్యామిలీకి సన్నిహితులమంటూ కొందరు మీడియాలో చౌకబారు ప్రకటనలు చేస్తున్నారన్నారు. అదంతా ఓ పబ్లిసిటీ స్టంట్గా అభివర్ణించారు. తమ కుటుంబసభ్యులు ఎవరూ ఈ ఘటనపై ప్రకటనలు చేయలేదన్నారు. ఇప్పుడు దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి