ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో యోగా విధానాలు, పరిశోధనపై జాతీయ సదస్సు
మానవాళికి ఆరోగ్యాన్ని అందించిన యోగాపై శాస్త్రీయ పరిశోధనలు, యోగా విధానాల అభివృద్ధి, యోగాను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు పలు అంశాలపై 2వ జాతీయ సదస్సు కొనసాగుతోంది.
బెంగళూరు: మానవాళికి ఆరోగ్యాన్ని అందించిన యోగాపై శాస్త్రీయ పరిశోధనలు, యోగా విధానాల అభివృద్ధి, యోగాను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు పలు అంశాలపై 2వ జాతీయ సదస్సు కొనసాగుతోంది. భారత యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఫిబ్రవరి 24-26 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి యోగా బృందాలు, ప్రఖ్యాత యోగా పండితులు, పరిశోధకులు, అభ్యాసకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ యోగా అసోసియేషన్ ఛైర్పర్సన్, ప్రపంచ మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రసంగించారు. ‘‘అనేక శతాబ్దాలుగా యోగా ఉన్నప్పటికీ, దాని శాస్త్రీయ వివరణ ప్రపంచం నలుమూలలకూ చేరవలసిన సమయం ఆసన్నమైంది. మన యోగా సంప్రదాయాల మౌలిక స్వరూపాన్ని, స్వచ్ఛతను మనం కాపాడుకోవాలి" అని పిలుపునిచ్చారు.
‘‘జీవితంలో కాంటెక్ట్స్ (విశాల దృక్పథం), కంపాషన్ (దయార్ద్ర హృదయం), కమిట్ మెంట్ (నిబద్ధత) అనే మూడు ‘సి’ లను కలిగి ఉండటం ముఖ్యం. విశాల దృక్పథం కలిగి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలపై మనసు అతిగా స్పందించడం మానేస్తుంది. తన పట్ల, ఇతరుల పట్ల దయ కలిగి ఉన్నప్పుడు చాలా సమస్యలు పరిష్కారమౌతాయి. వీటికి తోడుగా జీవితంపట్ల నిబద్ధతను కలిగి ఉడటం చాలా ముఖ్యం. యోగా మనకు ఈ మూడింటినీ ఇస్తుంది’’ అని అని గురుదేవ్ తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం అనే ఆలోచనే పునాదిగా 2006లో భారతీయ యోగా అసోసియేషన్ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన యోగాలోని వైవిధ్య విధానాలను, సుసంపన్నమైన, విభిన్నమైన సాంస్కృతిక వారసత్వాలను, సంప్రదాయాలను అనుసంధానం చేయడం, సేకరించడం, ఒకచోట చేర్చడం వంటి పనులను చేపడుతోంది. భారతీయ యోగా అసోసియేషన్ అధ్యక్షులు, రచయిత, పరిశోధకుడు ప్రాచీన యోగా పాఠశాలల్లో ఒకటైన యోగా ఇన్స్టిట్యూట్ (ముంబయి) డైరెక్టర్ మా హంస మాట్లాడుతూ.. 3-హెచ్ గురించి వివరించారు. ‘మొదటి హెచ్ (హార్డ్) కష్టపడి పని చేయండి. చేసిన పనిని, జీవితంతో సమన్వయం చేసుకోవాలి. రెండవ హెచ్ (హెడ్)- తల లేదా మనస్సు సరిగ్గా ఉండాలి. ప్రతిదాన్ని సానుకూల దృక్పథంతో చూడండి. మూడో హెచ్ (హార్ట్) మనసు - ఇది చేతులతో (చేసే పనితో), చేయించే బుద్ధితో కలిసి పనిచేయాలి. మీరు సంపూర్ణమైన వ్యక్తులుగా జీవించాలి’’ అన్నారు.
మానసిక ప్రశాంతత లేకుండా ప్రపంచ శాంతి సాధించడం ఎందుకు అసాధ్యమనే అంశంపై ఆచార్య లోకేష్ ముని మాట్లాడారు. భారతదేశపు అద్భుతమైన యోగ సంస్కృతి గురించి డాక్టర్ బసవారెడ్డి తన అభిప్రాయాలను పంచుకుంటూ, భౌతిక, మానసిక ప్రపంచాలను ఏకం చేసే జ్ఞానాన్ని ఇస్తూ క్రమంగా ప్రకృతిని, విశ్వాన్నంతటినీ యోగా ఏకం చేయగలదని అన్నారు.
ఈ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖులు వీరే..
పద్మశ్రీ డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర, భారతీయ యోగా అసోసియేషన్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు; డాక్టర్ బసవారెడ్డి- మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, మాజీ డైరెక్టర్; అహింసా విశ్వ భారతి వ్యవస్థాపకుడు ఆచార్య లోకేష్ ముని; స్వామి ఆత్మప్రియానంద్, భారతీయ యోగా అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్; సుబోధ్ తివారీ- కైవల్యధామ్ సీఈవో; మా హంస- భారతీయ యోగా అసోసియేషన్ అధ్యక్షులు; డాక్టర్ ఆనంద్ బాలయోగి- జాయింట్ సెక్రటరీ, భారతీయ యోగా అసోసియేషన్; యోగాచార్యుడు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సల్యుటోజెనిసిస్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ (ISCM) డైరెక్టర్; డా. ఎస్ పి మిశ్రా- హరిద్వార్లోని దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ వ్యవస్థాపక వైస్-ఛాన్సలర్; డాక్టర్ ఎన్ కె మంజునాథ్ భారతీయ యోగా అసోసియేషన్ రీసెర్చ్ కమిటీ డైరెక్టర్; కమలేష్ బర్వాల్
ఈ సదస్సులో భాగంగా యోగా పరిశోధనకు సంబంధించి మూడు ఎంవోయూలపై సంతకాలు చేయనున్నారు. ఆ ఒప్పందాలు ఇవే..
- శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రీసెర్చ్ వింగ్ - ఇన్స్టిట్యూట్ ఆఫ్ సలుటోజెనిసిస్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ మధ్య శ్రీ బాలాజీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం, పుదుచ్చేరి మధ్య ఒప్పందంలో భాగంగా యోగ, ధ్యానం, సంగీతం, మంత్ర జపాల ప్రభావాన్ని వ్యాధుల నివారణకు ఉపయోగించడంపై వైద్యశాలల వాతావరణంలో పరిశోధిస్తారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు ఈ రెండు చోట్లా పరిశోధనలు, చదువు సాగించి మాస్టర్స్, డాక్టరేట్ పట్టాలను పొందే వీలుంటుంది.
- సాంకేతిక నైపుణ్యం, ఆచరణాత్మక శాస్త్రీయ విధానాలను పురాతన సంప్రదాయాల స్వచ్ఛతతో సమ్మిళితం చేసి యోగాను అందించడంలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీ స్కూల్ ఆఫ్ యోగా, శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రీసెర్చ్ వింగ్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించి యోగాలో అత్యున్నత ప్రమాణాలను సృష్టించడంపై పరిశోధనలు సాగిస్తారు.
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, భారతీయ యోగా అసోసియేషన్ మధ్య ఒప్పందం. భారతీయ యోగా అసోసియేషన్ సభ్య సంస్థలకు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు పరస్పర ఆసక్తి గల అంశాలపై సహకారాన్ని అందించడం ఈ ఒప్పందం లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్