Nitish Kumar: దర్యాప్తు సంస్థల సోదాలు..రాజకీయ ప్రేరేపితమే: నీతీశ్కుమార్
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై జరుగుతున్న సీబీఐ, ఈడీ దాడులు రాజకీయప్రేరేపితమైనవేనని జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ ఆరోపించారు.
పట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad Yadav), ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ (CBI), ఈడీ (ED) దాడులు చేయడాన్ని జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ (Nitish Kumar) తప్పుబట్టారు. కేవలం ఆ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకే దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉసిగొల్పుతోందని విమర్శించారు. ఈ దాడులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆరోపించారు. ఇదే పరిస్థితులు 2017లోనూ ఎదురయ్యాయని నితీశ్కుమార్ గుర్తు చేశారు. తాజాపరిస్థితుల నేపథ్యంలో మహాఘట్ బంధన్ కూటమి నుంచి జేడీయూ బయటకి వస్తుందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. మహాఘట్ బంధన్లో జేడీయూతోపాటు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు సభ్యులుగా ఉన్నారు.
రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్తోపాటు, ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ గత వారం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు లాలూ కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు నీతీశ్ కుమార్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ, ఈడీ దాడులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని అన్నారు. 2017లో జేడీయూ, భాజపాకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోందని గుర్తు చేశారు. ‘‘ హోటళ్లకు సంబంధించిన భూమి విషయంలో అప్పట్లో వచ్చిన ఆరోపణల్లో తేజశ్వీ యాదవ్ పేరును కూడా చేర్చారు. ఈ విచారణను భాజపా తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా తేజశ్వీని తొలగించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ, ఆర్జేడీ నేతలు అందుకు ఒప్పుకోలేదు. అందుకే స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. 24 గంటల్లోగా భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది’’ అని నీతీశ్ కుమార్ మీడియాకు తెలిపారు. అయితే, ప్రస్తుతం మహాఘట్బంధన్ నుంచి జేడీయూ వేరు కాదని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434