Loksabha Elections: బ్యాలెట్ పేపర్కు బదులు.. బ్యాలెట్ పుస్తకం.. అసలేం జరిగింది?
ప్రస్తుతం దిల్లీ శివార్లలో జరుగుతున్న రైతుల నిరసనలు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి.
దిల్లీ: దాదాపు 3 దశాబ్దాల క్రితం ప్రభుత్వ విధానాలపై విరక్తి చెందిన తమిళనాడు (TamilNadu) రైతులు ఒకే నియోజకవర్గానికి 1,033 నామినేషన్లు సమర్పించి దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఉపసంహరించుకునేందుకు ససేమిరా అనడంతో ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్కు (Ballot Paper) బదులు.. అభ్యర్థులందరి పేర్లతో బ్యాలెట్ పుస్తకాలను ముద్రించాల్సి వచ్చింది. తాజాగా దిల్లీ, హరియాణా శివారుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అప్పటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. కనీస మద్దతు ధర చెల్లించడంతోపాటు, వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పంజాబ్ రైతులు గత కొన్ని నెలలుగా దిల్లీ పరిసర ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. అయితే, తమిళనాడు రైతుల మాదిరిగా రాజకీయ మార్గంలోకి వెళ్లే ఆలోచనలేదని పంజాబ్ రైతులు చెబుతున్నారు.
భాజపా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో పోటీ చేసి నిరసన వ్యక్తం చేసే ఆలోచన లేదని అఖిల భారత కిసాన్ సభ సభ్యుడు కిష్ణప్రసాద్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ సభ్యుడు అభిమన్యు కోహర్ మాట్లాడుతూ.. ‘‘ ఫిబ్రవరి 13 నుంచి దిల్లీ శివార్లలో ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీల నేతలు రైతులకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. అధికారంలోకి రాగానే.. రైతు వ్యతిరేకులుగా మారి, కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్నారు’’ అని మండిపడ్డారు.
అప్పుడేం జరిగింది?
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తమిళనాడుకు చెందిన రైతులు ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పందన కరవవ్వడంతో 1996 సార్వత్రిక ఎన్నికల్లో ఈరోడ్ లోక్సభ స్థానానికి 1,033 నామినేషన్లు సమర్పించారు. స్థానిక నేతలు, పలువురు అధికారులు వారితో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. నామినేషన్లు చట్టబద్ధంగా ఉండటంతో ఎన్నికల సంఘం కూడా వారిని అడ్డుకోలేకపోయింది. దీంతో వార్తా పత్రికలను పోలినట్లుగా వారి పేర్లతో బ్యాలెట్ పుస్తకాలను ముద్రించి పోలింగ్ కేంద్రాలకు పంపింది.
ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి చెందిన సుబ్బులక్ష్మి జగదీశన్ విజయం సాధించారు. రెండో స్థానంలో ఏడీఎంకేకి చెందిన ఆర్.ఎన్.కిట్టుస్వామి నిలిచారు. వీరిద్దరితో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి మినహా మిగతా వారి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 88 మందికి ఒక్క ఓటు కూడా రాకపోగా.. 158 మంది అభ్యర్థులకు ఒకేఒక్క ఓటు నమోదైంది. ఈ ఘటనతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. అప్పటి వరకు ఉన్న రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ను.. ఆ తర్వాతి ఎన్నికల నుంచి రూ.10 వేలకు పెంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?