Loksabha Elections: బ్యాలెట్ పేపర్కు బదులు.. బ్యాలెట్ పుస్తకం.. అసలేం జరిగింది?
ప్రస్తుతం దిల్లీ శివార్లలో జరుగుతున్న రైతుల నిరసనలు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి.
దిల్లీ: దాదాపు 3 దశాబ్దాల క్రితం ప్రభుత్వ విధానాలపై విరక్తి చెందిన తమిళనాడు (TamilNadu) రైతులు ఒకే నియోజకవర్గానికి 1,033 నామినేషన్లు సమర్పించి దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఉపసంహరించుకునేందుకు ససేమిరా అనడంతో ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్కు (Ballot Paper) బదులు.. అభ్యర్థులందరి పేర్లతో బ్యాలెట్ పుస్తకాలను ముద్రించాల్సి వచ్చింది. తాజాగా దిల్లీ, హరియాణా శివారుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అప్పటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. కనీస మద్దతు ధర చెల్లించడంతోపాటు, వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పంజాబ్ రైతులు గత కొన్ని నెలలుగా దిల్లీ పరిసర ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. అయితే, తమిళనాడు రైతుల మాదిరిగా రాజకీయ మార్గంలోకి వెళ్లే ఆలోచనలేదని పంజాబ్ రైతులు చెబుతున్నారు.
భాజపా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో పోటీ చేసి నిరసన వ్యక్తం చేసే ఆలోచన లేదని అఖిల భారత కిసాన్ సభ సభ్యుడు కిష్ణప్రసాద్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ సభ్యుడు అభిమన్యు కోహర్ మాట్లాడుతూ.. ‘‘ ఫిబ్రవరి 13 నుంచి దిల్లీ శివార్లలో ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీల నేతలు రైతులకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. అధికారంలోకి రాగానే.. రైతు వ్యతిరేకులుగా మారి, కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్నారు’’ అని మండిపడ్డారు.
అప్పుడేం జరిగింది?
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తమిళనాడుకు చెందిన రైతులు ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పందన కరవవ్వడంతో 1996 సార్వత్రిక ఎన్నికల్లో ఈరోడ్ లోక్సభ స్థానానికి 1,033 నామినేషన్లు సమర్పించారు. స్థానిక నేతలు, పలువురు అధికారులు వారితో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. నామినేషన్లు చట్టబద్ధంగా ఉండటంతో ఎన్నికల సంఘం కూడా వారిని అడ్డుకోలేకపోయింది. దీంతో వార్తా పత్రికలను పోలినట్లుగా వారి పేర్లతో బ్యాలెట్ పుస్తకాలను ముద్రించి పోలింగ్ కేంద్రాలకు పంపింది.
ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి చెందిన సుబ్బులక్ష్మి జగదీశన్ విజయం సాధించారు. రెండో స్థానంలో ఏడీఎంకేకి చెందిన ఆర్.ఎన్.కిట్టుస్వామి నిలిచారు. వీరిద్దరితో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి మినహా మిగతా వారి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 88 మందికి ఒక్క ఓటు కూడా రాకపోగా.. 158 మంది అభ్యర్థులకు ఒకేఒక్క ఓటు నమోదైంది. ఈ ఘటనతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. అప్పటి వరకు ఉన్న రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ను.. ఆ తర్వాతి ఎన్నికల నుంచి రూ.10 వేలకు పెంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
Puducherry: మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్