Tiruvanantapuram: రేషన్ షాపుల్లో మోదీ పోస్టర్లు.. ఆ ఆదేశాలు సరికాదు: కేరళ సీఎం
రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.
తిరువనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, దాన్ని అమలుచేయడం కష్టమని కేరళ(Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రేషన్ దుకాణాల్లో మోదీ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందా అని అడిగిన ప్రతిపక్ష ఎమ్మెల్యే పి.అబ్దుల్ హమీద్(Abdul Hameed) ప్రశ్నకు ముఖ్యమంత్రి ఈవిధంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో రేషన్ వ్యవస్థ ఎప్పటినుంచో ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త పబ్లిసిటీ పద్ధతిని అనుసరిస్తుందని స్పష్టమవుతోంది.’’ అని మండిపడ్డారు.
ఈ ఆదేశాలు సరికావని, వాటిని రాష్ట్రంలో అమలుచేయడం కష్టమని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఈ విషయాన్ని భారత ఎన్నికల కమిషన్(Election Commission of India) దృష్టికి తీసుకెళ్లాలా, లేదా అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్(GR Anil) మాట్లాడుతూ 14 వేలకు పైగా ప్రధాని పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ), రాష్ట్ర ఆహార శాఖకు బాధ్యత అప్పగించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 550 రేషన్ దుకాణాల్లో పీఎం సెల్ఫీ పాయింట్లును ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశించిందని, వాటిని తనిఖీ చేయాల్సిందిగా ఎఫ్సీఐ అధికారులకు సూచించామన్నారు. ఆహార పదార్థాల పంపిణీకి కేంద్ర ప్రభుత్వ గుర్తులున్న క్యారీ బ్యాగ్లను సరఫరా చేయాలని చెప్పారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారం కోసం రేషన్ పంపిణీ వ్యవస్థను ఉపయోగించుకోవడం సరికాదని మంత్రి దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.