Bridge Collapses: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఒకరి మృతి..
నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ఓ కార్మికుడు మృతి చెందగా.. 30 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకున్న ఘటన బిహార్లో చోటు చేసుకుంది.
పట్నా: బిహార్లోని సుపాల్లో నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కూలిపోయింది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా.. 30 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ కౌశల్ కుమార్(Kaushal Kumar) తెలిపారు. క్షతగాత్రులకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెన కింద 40 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారని, ఇప్పటి వరకూ 9 మందిని రక్షించామని తెలియజేశారు. సుపాల్, మధుబని జిల్లాలను కలుపుతూ కోసి నదిపై 10.2 కిలో మీటర్ల మేర ఈ వంతెనను నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దర్శనమిచ్చిన బద్రీనాథుడు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. -
దిల్లీలో 20 ఆసుపత్రులకు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 20 ఆసుపత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ), ఉత్తర రైల్వే సీపీఆర్వో కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్