Republic Day: రిపబ్లిక్ డే పరేడ్కు తొలిసారి ఆర్మీ మేడిన్ ఇండియా ఆయుధాలు..!
రిపబ్లిక్ డే పరేడ్లో ఆత్మనిర్భర్ భారత్ శక్తిని ప్రపంచానికి తెలియజేయనుంది. దీనికి తగినట్లే పరేడ్ను సిద్ధం చేస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఈ సారి రిపబ్లిక్ డే(Republic Day) పరేడ్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే దిల్లీలో పరేడ్కు సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ పరేడ్కు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి ముఖ్య అతిథిగా రానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్కు సంబంధించిన టికెట్లను కూడా ప్రభుత్వం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. కేవలం భారత్లో తయారు చేసిన ఆయుధాలను మాత్రమే ఆర్మీ దీనిలో ప్రదర్శించనుంది. ఈ పరేడ్కు సంబంధించిన వివరాలను దిల్లీ ఏరియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ భవినీష్ కుమార్ వెల్లడించారు. ఉదయం 10.30కు ఈ పరేడ్(Republic Day) విజయ్ చౌక్ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగుతుంది. ఈ ఏడాది కర్తవ్యపథ్(గతంలో రాజ్పథ్గా పిలిచే మార్గం)లో రిపబ్లిక్ డే కార్యాక్రమంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆయుధాలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఆయుధాలు కాకుండా.. ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయుసేన, నేవీకి చెందిన ఒక్కో బృందం దీనిలో పాల్గొంటాయి.
* సంప్రదాయ 21 గన్ సెల్యూట్కు ఉపయోగించే పురాతన బ్రిటిష్ పౌండర్ గన్స్ను 105ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్తో భర్తీ చేయనున్నారు.
* ఈజిప్ట్ నుంచి వచ్చిన ప్రత్యేక సైనిక పటాలం కూడా ఈ పరేడ్లో పాల్గొననుంది. దీనిలో 120 ఈజిప్ట్ సైనికులు ఉంటారు. వీరు ఇప్పటికే దిల్లీ చేరుకొని సాధన చేస్తున్నారు.
* కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీరులు ఈ పరేడ్లో భాగస్వాములు కానున్నారు.
* ఆర్మీ సిగ్నల్ కోర్, ఎయిర్ డిఫెన్స్, ఆర్మీ డేర్ డెవిల్స్ విభాగాల నుంచి మహిళా అధికారులు మార్చ్లో పాల్గొంటారు. ఆకాశ్ క్షిపణుల విభాగానికి లెఫ్టినెంట్ చేతన శర్మ నేతృత్వం వహించనున్నారు.
* బీఎస్ఎఫ్ క్యామెల్ కంటెజెంట్లోని మహిళా సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
* ‘నారీశక్తి’ ప్రదర్శనలో భాగంగా నేవీలో 144 సెయిలర్స్ బృందానికి మహిళా అధికారిణులు నేతృత్వం వహించనున్నారు.
* ఈ పరేడ్(Republic Day) కోసం నేవీకి చెందిన ఐఎల్-38 విమానం చివరిసారిగా గాల్లోకి ఎగరనుంది. ఈ విమానం 42 ఏళ్లుగా నౌకాదళానికి సేవలు అందించింది.
* రిపబ్లిక్ డే ఫ్లైపాస్ట్లో మొత్తం 44 విమానాలు పాల్గొననున్నాయి. వీటిల్లో తొమ్మిది రఫేల్ జెట్ విమానాలు కూడా ఉండనున్నాయి. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి అటాక్ హెలికాప్టర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్