Lok Sabha polls: జాతీయ పార్టీల ప్రస్థానం .. అప్పట్లో 14.. ఇప్పుడు 6
ఏడు దశాబ్దాల కాలంలో కొత్తగా వందల పార్టీలు పుట్టుకురాగా.. మరికొన్ని మాత్రం ఉనికిలో లేకుండా పోయాయి. ప్రస్తుత 18వ లోక్సభ ఎన్నికల్లో ఆరు జాతీయ పార్టీలు బరిలో నిలిచాయి.
ఇంటర్నెట్ డెస్క్: తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో 53 రాజకీయ పార్టీలు బరిలో నిలిచాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 2,500 (గుర్తింపు పొందని వాటితో కలిపి)కు చేరింది. ఈ క్రమంలో జాతీయ పార్టీల సంఖ్య మాత్రం తగ్గిపోతూ వచ్చింది. మొదట్లో 14 జాతీయ పార్టీలుంటే ప్రస్తుతం ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. ఇక ఈ ఏడు దశాబ్దాల కాలంలో ఆవిర్భావం నుంచి విలీనం వరకూ వీటి ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. దేశంలో కొత్తగా వందలాది రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చినా.. చాలావరకు ఉనికిలో లేకుండా పోయాయి. ప్రస్తుతం 18వ లోక్సభ ఎన్నికల్లో ఆరు జాతీయ పార్టీలు మాత్రమే బరిలో నిలిచాయి.
53 పార్టీలతో మొదలై..
1951-52లో మొదటి సాధారణ ఎన్నికల సమయంలో 53 రాజకీయ పార్టీలు బరిలో ఉన్నాయి. అందులో 14 జాతీయ పార్టీలు కాగా మిగతావి రాష్ట్ర పార్టీలుగా పరిగణించారు. తొలి ఎన్నికలకు ముందు దాదాపు 29 రాజకీయ పార్టీలు తమకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. చివరకు అందులో కేవలం పద్నాలుగింటికి మాత్రమే జాతీయ హోదా కల్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. చివరకు ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్, ప్రజా సోషలిస్ట్ పార్టీ (సోషలిస్టు పార్టీ, కిసాన్ మజ్దూర్ పార్టీ కలిసి), సీపీఐ, జనసంఘ్లు మాత్రమే జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్నాయి. మొత్తంగా ఏడు దశాబ్దాల్లో వీటి ప్రయాణాన్ని చూస్తే..
LS polls: ఎన్నికల నియమావళి.. తొలి ‘కోడ్’ కూసింది అప్పుడే!
- 1957 రెండో సార్వత్రిక ఎన్నికల నాటికి మొత్తం 15 పార్టీలు మిగలగా.. అందులో నాలుగు మాత్రమే జాతీయ పార్టీలు.
- 1962 ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల సంఖ్య 27కు చేరగా.. కొత్తగా సోషలిస్టు (SOC), స్వతంత్ర (SWA) పార్టీలతో జాతీయ పార్టీల సంఖ్య 6కు పెరిగింది.
- 1951 ఎన్నికల తర్వాత తదుపరి రెండుసార్లు సీపీఐ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1964లో ఆ పార్టీ రెండుగా చీలి సీపీఐ (మార్క్సిస్ట్) పార్టీ అవతరించింది. అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ కంటే సీపీఎం ఎక్కువ ఓట్లను గెలుచుకుంది.
- స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించిన జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలోని సోషలిస్ట్ పార్టీ కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీలో విలీనమై ప్రజా సోషలిస్ట్ పార్టీగా (PSP) అవతరించింది.
- ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన జేపీ.. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పీఎస్పీ, ఇతర వర్గాలతో కలిసి భారతీయ లోక్దళ్ను ఏర్పాటుచేశారు. ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెస్కు వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలన్నీ ఏకమై జనతా పార్టీగా అవతరించాయి. భాజపా, సమాజ్వాదీ వంటి పార్టీల మూలాలు జనతా పార్టీవే.
పాతవి పోయి.. కొత్తవి వచ్చి..
- 1992లో ఏడు జాతీయ పార్టీలు.. భాజపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనతాదళ్, జనతా పార్టీ, లోక్దళ్ పార్టీలు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచాయి.
- 1996లో సాధారణ ఎన్నికల్లో మొత్తంగా 209 పార్టీలు భాగస్వామ్యం కాగా అందులో ఎనిమిది జాతీయ పార్టీలున్నాయి. 1998 వచ్చేసరికి ఏడు జాతీయపార్టీలు సహా 176 మాత్రమే బరిలో నిలిచాయి.
- 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు పడిపోయింది. (భాజపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ-ఎం, ఎన్సీపీ, బీఎస్పీ)
- మొట్టమొదటి లోక్సభ ఎన్నికల నుంచి 2014 ఎన్నికల వరకు అత్యధిక సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాతే భాజపా హవా మొదలయ్యింది.
- 2016లో మమతా బెనర్జీ సారథ్యంలోని ఆల్ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదా సాధించింది.
- 2019 ఎన్నికల్లో మొత్తంగా 674 పార్టీలు ఉంటే అందులో ఏడు జాతీయ పార్టీలు. అయితే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)లు ఇటీవల జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. అదేసమయంలో ఆమ్ఆద్మీ పార్టీ (AAP) ఈ హోదా దక్కించుకుంది.
- ఇలా ఏడు దశాబ్దాల క్రితం 14తో మొదలైన జాతీయ పార్టీల ప్రస్థానం ప్రస్తుతం ఆరు (భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ఆద్మీ పార్టీ)కు పరిమితమైంది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, జాతీయ పార్టీ హోదా పొందాలంటే.. లోక్సభ ఎన్నికల్లో కనీసం మూడు రాష్ట్రాల్లో రెండు స్థానాలు చొప్పున గెలుచుకోవాలి లేదా నాలుగు లోక్సభ స్థానాలతోపాటు నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరుశాతం ఓట్లయినా పొందాలి. లేదా నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు కలిగిఉండాలి. ఈ హోదా లభిస్తేనే దేశవ్యాప్తంగా పార్టీకి గుర్తు ఒకటే ఉంటుంది. దీంతోపాటు దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం స్థలం కూడా కేటాయిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు