LS polls: ఎన్నికల నియమావళి.. తొలి ‘కోడ్’ కూసింది అప్పుడే!
ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలక భూమిక పోషించే ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ (Model Code of Conduct)కి 1960లో అడుగులు పడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) నిర్వహణకు సిద్ధమైన ఎన్నికల సంఘం.. నేడు పోలింగ్ షెడ్యూల్ను విడుదల చేయనుంది. ఈసీ (Election Commission) ప్రకటన వెంటనే దేశవ్యాప్తంగా ‘ఎన్నికల నియమావళి’ (Model Code of Conduct) అమల్లోకి వస్తుంది. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలక భూమిక పోషించే ఈ నియమావళికి 1960లోనే అడుగులు పడ్డాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తొలిసారి వీటికి బీజం పడింది. ప్రస్తుతం లోక్సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న వేళ 60ఏళ్ల ‘నియమావళి’ ప్రస్థానాన్ని పరిశీలిస్తే..
చట్టబద్ధత లేకున్నా..
ఎన్నికల సమయంలో పార్టీలు, అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించి భాగస్వామ్య పక్షాల ఏకాభిప్రాయంతో రూపొందించిన నిబంధనల స్వరూపమే ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ (MCC). సక్రమంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ జరగడమే దీని ముఖ్య ఉద్దేశం. అధికార పార్టీ.. ప్రభుత్వ యంత్రాంగం, ఆర్థిక వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడం కూడా దీని లక్ష్యం. ఎన్నికల సంఘం షెడ్యూల్ (Election Schedule) ప్రకటించడం మొదలు.. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ‘ప్రవర్తనా నియమావళి’ నిబంధనలు అమలులో ఉంటాయి. కానీ, వీటికి ఎలాంటి చట్టబద్ధత లేదు. అయినప్పటికీ దీనికి ఉన్న ప్రాముఖ్యాన్ని సుప్రీం కోర్టు (Supreme Court) పలు సందర్భాల్లో సమర్థించింది. కోడ్ ఉల్లంఘిస్తే.. దర్యాప్తు జరిపి, శిక్ష విధించడానికి ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేసింది.
‘మినిమమ్ కోడ్ ఆఫ్ కండక్ట్’తో మొదలై..
దేశంలో 1968-69లో జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలో ‘మినిమమ్ కోడ్ ఆఫ్ కండక్ట్’ పేరుతో సెప్టెంబర్ 26, 1968న ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) తొలిసారి జారీ చేసింది. ‘ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల పాత్ర, బాధ్యతలు: ఎన్నికల ప్రచార సమయంలో కనీస ప్రవర్తనా నియమావళి పాటించాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి’ అనే పేరుతో దీన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత 1972, 1982, 1991, 2013లో నియమావళిని సవరించారు. అధికారంలో ఉన్న పార్టీల తీరుపై పర్యవేక్షణ అంశాన్ని 1979లో చేర్చారు. ‘‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రస్తుత రూపం సంతరించుకోవడానికి 60 ఏళ్లు పట్టింది. 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తొలిసారి దీన్ని అమలుచేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రవర్తించాల్సిన నియమాల రూపకల్పనతో దీనికి బీజం పడింది’’ అని భారత్లో ఎన్నికల ప్రయాణానికి సంబంధించి ఈసీ ప్రచురించిన ‘‘లీప్ ఆఫ్ ఫెయిత్ (Leap of Faith)’’ పుస్తకంలో పొందుపరిచారు.
కమిటీ సిఫార్సులు..
ప్రవర్తనా నియమావళికి చట్టబద్ధత కల్పించాలంటూ 2013లో ఓ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. తద్వారా ఎన్నికల సంఘం తన అధికారాలను సమర్థంగా వినియోగించుకునేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండవని పేర్కొంది. ఎన్నికలను ప్రకటించినప్పుడు కాకుండా నోటిఫికేషన్ విడుదలైనప్పటినుంచి కోడ్ అమలులోకి తేవడం, అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిపై మరింత స్పష్టత తెచ్చేందుకు సవరణ చేయడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎన్నికల వివాదాలను 12 నెలల్లో పరిష్కరించడం, ఎన్నికైన ఆరు నెలల్లోగా స్వతంత్ర ఎంపీలు ఏదైనా రాజకీయ పార్టీలో చేరడం వంటివి సవరణలను సూచించింది.
ఉల్లంఘిస్తే చర్యలు..
నియమావళికి చట్టబద్ధత కల్పిచేందుకు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ.. తన పదవీకాలంలో తీవ్రంగా కృషి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసీ ప్రకారం, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రచారానికి తమ అధికారాలను ఉపయోగించుకోకూడదని ఎన్నికల నియమావళి స్పష్టంగా చెబుతుంది. మంత్రులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఏ రూపంలోనూ ఆర్థిక నిధులు ప్రకటించలేరు. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఓటరును ప్రభావితం చేసే ఏ ప్రాజెక్టు, పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించకూడదు. మంత్రులు కూడా ప్రచారం కోసం అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. -
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
తమ సర్వీసుల నిలిపివేసే యోచన వాట్సప్, దాని మాతృసంస్థ మెటాకు లేదని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 5కోట్లకు పైనే: కేంద్రం
దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. -
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొత్త ఇంటికి మారనున్నారు. -
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు
-
ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తే: విజయ్ ఆంటోనీ సమాధానమేంటంటే?
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ