Lok Sabha elections: కాంగ్రెస్‌లో విలీనమైన జన్ అధికార్ పార్టీ

లోక్‌సభ ఎన్నికలకు నెల ముందు పప్పూ యాదవ్ బుధవారం తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 

Published : 20 Mar 2024 18:53 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు నెల ముందే పప్పూయాదవ్ బుధవారం తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆయన మంగళవారం సాయంత్రం ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌లను కలిశారు. లాలూప్రసాద్‌తో నాకు రాజకీయ సంబంధాలు లేవని, ఓ ఆలోచనను పంచుకోవడం కోసం తామందరం కలిశామని ఆయన తెలిపారు. సీమాంచల్‌, మిథిలాంచల్‌లలో భాజపాను ఎలాగైనా అడ్డుకోవాలన్నదే తమ ప్రయత్నమని తెలిపారు. 

తేజస్వి యాదవ్‌ పార్టీలో నమ్మకంగా పనిచేస్తూ రాహుల్ గాంధీ హృదయాన్ని గెలుచుకున్నారు. మేము ఈ ఎన్నికల్లో  మాత్రమే కాదు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తాము. భాజపా ఓటమి, బలహీనవర్గాల అభివృద్ధే మా ధ్యేయం అని పప్పూయాదవ్‌ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి పోరాడతాం. ప్రజల హృదయాన్ని గెలుచుకున్నవారే ఈ దేశానికి ప్రధాని అవుతారు అని ఆయన పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని