Chennai: చెన్నై రాజ్‌భవన్‌ వద్ద పెట్రోల్‌ బాంబు కలకలం.. విసిరిన వ్యక్తి అరెస్టు

చెన్నైలోని రాజ్‌భవన్‌ మెయిన్‌ గేటు వద్ద ఓ వ్యక్తి పెట్రోల్‌ బాంబు విసరడం కలకలం రేపింది.

Published : 25 Oct 2023 18:40 IST

చెన్నై: తమిళనాడులోని చెన్నైలో రాజ్‌భవన్‌ వద్ద పెట్రోల్‌ బాంబు విసిరిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాజ్‌భవన్‌ బయట ప్రధాన గేటు వద్ద ఓ వ్యక్తి పెట్రోల్‌తో ఉన్న సీసాను విసిరాడు. దీంతో అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పెట్రోల్‌ బాంబు విసరడం వెనుక ఉన్న అతడి ఉద్దేశంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై తమిళనాడు భాజపా అధ్యక్షుడు కె. అన్నామలై స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో ఈ ఘటన సూచిస్తుందంటూ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని